24 September 2016

మనసాంప్రదాయంలో స్త్రీలు పాటించవలసిన ఆచారాలు.

ఇళ్ళముందు ముగ్గులు:-

మన హిందూ సాంప్రదాయంలో ప్రతి రోజు స్త్రీలు ఉదయం ఇళ్ళముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయమని చెప్పడానికి ఆరోగ్య కారణాలున్నాయి. శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేకానేక వెన్ను సమస్యలకు దారి తీస్తుంది. రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది. ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం సత్ఫలితాలనిస్తుందని గమనించారు మన పెద్దలు. ఉదయమే నడుముకు సంబంధించిన వ్యాయామంలో భాగమే స్త్రీలు ముగ్గు వేయడం. ముగ్గులు వేయాలంటే నడుమువంచాలి. చుక్కలు పెడతారు, అవి కలపడానికి అటు, ఇటు చేతులు, నడుము కదపాలి. ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయమం చేసినవారవుతారు. దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు. అందుకే ఉదయమే ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో భాగంగా పెట్టారు.

 ఈనాటి కాలంలో ఒక్కసారి గమనిస్తే, మనమూ, మన పిల్లలు కూడా శరీరంలో అన్ని భాగాలకు తగిన వ్యాయామం అందివ్వడంలేదు. పిల్లలు పొద్దున బడికి వెళ్తే, ఏ రాత్రో ఇంటికి వస్తున్న రోజులివి. ఇంట్లో సౌకర్యాలు అన్ని ఉండడం వల్ల అసలు నడుము ఒంచి పని చేసే అవకాశం ఉండడంలేదు. ఇది దీర్ఘకాలంలో వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలను కారణం అవుతుంది. వారు ఆ కాలంలో ఆలోచించి వాడుకలోకి తెచ్చిన ఈ సంప్రదాయం ఈ కాలం వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పెయింట్లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాం.












స్త్రీలే వేయాలా అంటే కాదు అనే చెప్పాలి. గర్భగుడిలో భగవంతుని వద్దకు పూజారి మాత్రమే వెళ్తాడు. దేవుడి వద్ద శుభరపరిచి, ఆయనే వేస్తారు(ఎందుకంటే గర్భ గుడిలోనికి పూజారి తప్ప వేరేవారు ప్రవేశించరు కనుక). అలాగే సూర్య భగవనుడికి సంబంధించిన పూజలు చేసే సమయంలో, ఇతర దేవతాపూజలలోనూ కొన్ని రకాల యంత్రాలను వేయవలసి ఉంటుంది. అప్పుడు కూడా ఉపాసకులే వేస్తారు.


ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి. ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి.


ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.


తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి.

యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి.

దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి. .













ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.















నుదుట‌న కుంకుమ బొట్టు ధ‌రించడం:-

నుదుట‌న కుంకుమ బొట్టును ధ‌రిస్తే అక్క‌డి న‌రాలు ఉత్తేజిత‌మై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయ‌ట‌. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ట‌. లైంగిక సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది.


బొట్టు పెట్టుకుంటే…!
నుదుట బొట్టుపెట్టుకునేందుకు
పసుపుతో చేసిన కుంకుమ శ్రేష్టమైనది.
పసుపు మన శరీరంపై అమితమైన
ప్రభావాన్ని చూపుతుంది.
రక్తాన్ని శుభ్రపరిచి శరీరకాంతిని
ఇనుమడింప జేస్తుంది.
కురుపులను, గాయాలను మాన్పుతుంది.
కుష్ఠు రోగాన్ని కూడా రూపుమాపే శక్తి పసుపుకు ఉంది.
కఫాన్ని అరికడుతుంది.
కుంకుమను అమ్మవారి ప్రసాదంగా
భావించి,
సర్వమంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరి
నారాయణీ నమోస్తుతే
అని జగన్మాతను ప్రార్థిస్తూ,
నుదుటన పెట్టుకుంటే సమస్త
మంగళాలు కలుగుతాయి.

ఉంగరపు వేలుతో బొట్టు
పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది.

నడిమి వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది.

బొటన వేలుతో పెట్టుకుంటే పుష్ఠి
కలుగుతుంది.

చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి
కలుగుతుంది.

మన శరీరంలో జ్ఞానేంద్రియ,
కర్మేంద్రియాలన మిగిలిన
అవయవాలకు ఒక్కొక్క
అధి దేవత ఉన్నారు.
వారిలో లలాట అధిదేవత బ్రహ్మ.
పరమ ప్రమాణములైన వేదాలు
బ్రహ్మ ముఖకమలం నుండి
వెలువడ్డాయి.
అందుకే బొట్టు పెట్టుకోవడానికి
బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది.
ద్వాదశ పుండ్రాలను పెట్టుకోక పోయినా,
కనీసం బొట్టు అయినా
పెట్టుకోవాలి.
అప్పుడు దేవుని పూజించినట్లే
అవుతుంది.




చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు.
అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై
ఎరుపురంగు వ్యాప్తిలోకి వచ్చింది.
ఇందులో నిగూఢార్థముంది.
మనలోని జీవుడు జ్యోతి
స్వరూపుడు.
ఆ జీవుడు జాగ్రదావస్థలో
భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో
సంచరిస్తుంటాడు.
మన నొసటిపై పెట్టుకున్న
కుంకుమబొట్టుపైన సూర్యకాంతి
ప్రసరిస్తే, కనుబొమల మధ్య నుండే
ఇడా పింగళ నాడులు సూర్యశక్తిని
గ్రహించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి.
ప్రాణశక్తికి కారణమైన నరాలకు
కేంద్రస్థానము కనుబొమల
మధ్య నుండే ఆజ్ఞాచక్రము.
కుంకుమ బొట్టును పెట్టుకోవడం
వల్ల ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్లే
అవుతుంది.
మానసిక ప్రవృత్తులను
నశింపజేసేదే ఆజ్ఞాచక్రమని
అంన్నారు.


















గోరింటాకు పెట్టుకోవ‌డం.:-

ఆషాఢ మాసం మనసులో మెదిలిందంటేనే గుర్తుకొచ్చేది గోరింటాకు. ఆడవాళ్ల చేతులు ఎర్రగా, అందంగా పండిపోతూ దర్శనమిస్తాయి ఈ నెల్లాళ్లు. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ మగాళ్లను సైతం ఇంట్లో పెద్దలు పోరుతూ ఉంటారు. కారణమేమంటే జ్యేష్ఠ మాసంలో మొదలైన వర్షాల ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. దీంతో కాళ్లు చేతులు రోజూ తడిచే ప్రమాదం ఉంది. దీంతో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం జరిగుతుంటాయి. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. 



ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మన పద్దతులు:- ఔషధీయుక్త సౌందర్య సాధనమైన గోరింటాకు స్త్రీలకు ప్రకృతి ప్రసాదించిన వరం .
గోరింటాకు పెట్టుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, జ్వ‌రం, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు కూడా తగ్గుతాయి.









పసుపు పారాణి పెట్టుకోవ‌డం:-

అందాన్ని, ఆరోగ్యాన్నీ ఇచ్చే పసుపు పారాణి స్త్రీలకు సంబంధించిన ఆచారాలు, అలవాట్లలో పసుపు, కుంకుమలకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పెళ్ళి, పేరంటం లాంటి శుభ సందర్భాల్లో కాళ్ళకు పసుపు రాసుకోవడం తప్పనిసరి. పారాణి పెట్టుకోవడం ఆనవాయితీ. పసుపు కుంకుమలను నీళ్ళతో కలిపి పారాణిగా తీర్చిదిద్దుకుంటారు మహిళలు. పసుపుకుంకుమలు శుభ సంకేతం. పసుపు కుంకుమలవల్ల ప్రత్యేకతను సంతరించుకోవడమే కాకుండా అందం, ఆరోగ్యం ఇనుమడిస్తాయి. పూజలు, వ్రతాలు లాంటి శుభ కార్యాల్లో పసుపుకుంకుమలకు చాలా ప్రాధాన్యత ఉంది. పండుగలు, పెళ్ళిళ్ళ లాంటి విశేష దినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్ళకు తప్పకుండా పసుపు రాసుకుంటారు. ముఖాన చిటికెడు కుంకుమ లేకపోతే ఎంత బోసిగా, అందవిహీనంగా ఉంటుంది. పూజలు మొదలు పెళ్ళి పేరంటాల పిలుపుల వరకూ అంతా పసుపు కుంకుమలతోనే ముడిపడి ఉంటుంది. స్నానం చేసేముందు ముఖానికి, చేతులకు పసుపు పట్టించి కొంతసేపయ్యాక స్నానం చేస్తారు. దీనివల్ల శరీర ఛాయ పెరుగుతుందని, ముఖంలో మంచి వర్చస్సు వస్తుందని, అన్నిటినీ మించి ఆరోగ్యానికి మంచిది. 











 నాల్గవరోజున, బంధువులు మరణించినప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకుంటారు. కారణం పసుపు క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. అలా నీళ్ళలో పసుపు వేసుకోవడంవల్ల మరింత శుద్ధి జరుగుతుంది. అనేక ఆయుర్వేద ఔషధాల్లో పసుపును ఉపయోగిస్తారు. దెబ్బ తగిలినప్పుడు, వెళ్ళసందులో పుండు ఏర్పడినప్పుడు, ఇతరత్రా గాయాలకు పసుపు అద్దడం తెలిసిందే. ఇన్ఫెక్షన్లు రాకుండా పసుపు కాపాడుతుంది. కళ్ళ కలకలు ల్లాంటి సమస్యలను నివారించడంలో పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. 













స్త్రీలే పసుపు ఎందుకు రాసుకుంటారు అనే సందేహం కలగడంలో ఆశ్చర్యం లేదు. అనాదిగా ఇంటిపనులు చేసేది, గృహ బాధ్యతలు నిర్వహించేదీ ఆడవాళ్ళే కదా! వంటావార్పు, అంట్లు కడగడం బట్టలు ఉతకడం లాంటి పనులు చేయడంవల్ల కాళ్ళు తడిలో నాని పాచిపోయే అవకాశం ఉంది. కాళ్ళకు పసుపు రాసుకోవడంవల్ల విరుగుడుగా (anti-allergicగా) పనిచేస్తుంది.

రావి చెట్టును పూజించ‌డం:-

హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజ‌లు చేస్తారు. ఈ చెట్ల‌యితే ఎక్కువ‌గా దేవాల‌యాల్లోనే ఉంటాయి. అయితే సాధార‌ణంగా చెట్ల‌న్నీ ప‌గ‌టి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట కూడ ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తుంది అందుకే రావి చెట్టును పూజిస్తారు. 



ఆల‌యాల్లో గంట‌లు ఉండ‌డం:-

ఆల‌యాల్లో ఉండే గంట‌ను ఏడు సార్లు కొడితే మ‌న శ‌రీరంలో ఉన్న ఏడు చ‌క్రాలు ఉత్తేజం అవుతాయ‌ట‌. అంతేకాదు మెద‌డు కుడి, ఎడ‌మ భాగాలు రెండూ కొంత సేపు ఏక‌మ‌వుతాయ‌ట‌. దీంతో మ‌న మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లుగుతుంద‌ట‌. ఏకాగ్ర‌త పెరుగుతుంద‌ట‌. గంట‌ను మోగించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయి.




నిద్రించేట‌ప్పుడు త‌ల‌ను ఉత్త‌రానికి పెట్ట‌క‌పోడం:-

భూమికి అయ‌స్కాంత క్షేత్రం ఉన్న‌ట్టుగానే మ‌న శ‌రీరానికి కూడా అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంది. ఒక వేళ మ‌నం ఉత్త‌రం దిశ‌గా త‌ల‌ను పెట్టి ప‌డుకుంటే మ‌న శ‌రీరంలో ఉన్న ఐర‌న్ మెద‌డుకు ప్ర‌వ‌హించి బీపీ, గుండె సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. త‌ల‌నొప్పి, అల్జీమ‌ర్స్‌, పార్కిన్‌స‌న్స్ డిసీజ్ వంటి వ్యాధులు వ‌స్తాయ‌ట‌. కాబ‌ట్టి త‌ల‌ను ఉత్త‌రం దిశ‌కు పెట్టి నిద్రించ‌కూడ‌దు.


రెండు చేతులతో న‌మ‌స్క‌రించ‌డం‌:-

ఎదురుగా ఉన్న వారికి రెండు చేతుల‌తో న‌మ‌స్క‌రిస్తే మ‌నం వారిని ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటామ‌ట‌. ఎలాగంటే రెండు చేతుల‌ను జోడించిన‌ప్పుడు చేతి వేళ్ల‌న్నీ క‌లిసిపోయి ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి మ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయ‌ట‌. దీంతోపాటు మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంది‌.












నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం:-

నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ప‌ద్మాస‌నం భంగిమ వ‌స్తుంది. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ట‌. కార‌మైన ఆహారం ముందు, స్వీట్లు త‌రువాత తిన‌డం… భోజ‌నం చేసిన‌ప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌ర‌మైన ఆమ్లాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంద‌ట‌. అయితే భోజ‌నం మొదట్లోనే స్వీట్లు తింటే అది మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేయ‌నీయ‌దు.









న‌దుల్లో నాణేలు వేయ‌డం:-

ఒక‌ప్పుడు మ‌న ద‌గ్గ‌ర రాగితో చేసిన నాణేలు చ‌లామ‌ణీలో ఉండేవి. ఈ కార‌ణంగా ఆ నాణేల‌ను న‌దుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేద‌ట‌. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూర‌మ‌య్యేవి.







ఉపవాసము వలన:-

ఉపవాసము అనగా ఉప=స్వామి సమీపము నందు, వాసః=నివసించుట. అనగా స్వామి యొక్క గొప్పదనమును తెలుసుకొను . అంతే కాని ఆకలి వేయుచుండగా జీవుని బాధించుకొనుట కానేకాదు. మధ్య మధ్యలో క్షీరపానము చేయవలయునని అర్ధము. దీనిచే శక్తి లభించును. మరియు పాలు సులభముగా జీర్ణమగుట వలన తమో గుణమైన మత్తురాదు. ఫలములు కూడా పాల వంటివే. ఆ విధముగా ఎవరు రోజంతయును సత్సంగములతో భజనలతో గడుపుదురో శక్తి కొరకు పానీయములను మాత్రము నోటిద్వారా తీసుకొందురో వారినే ఉపవాసము చేయువారందురు . ఉప‌వాసం ఉండ‌డం… హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉప‌వాసం ఉంటారు క‌దా. ఆయుర్వేద ప్ర‌కారం అలా ఉప‌వాసం ఉండ‌డం మంచిదేన‌ట‌. ఎందుకంటే ఉప‌వాస స‌మ‌యంలో మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థకు పూర్తిగా విశ్రాంతి ల‌భించి శ‌రీరంలో ఉన్న ప‌లు విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్ట‌బ‌డ‌తాయ‌ట‌. దీంతోపాటు దేహం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంద‌ట‌. ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు రావ‌ట‌. ఉపవాసము లో రకాలు : సంపూర్ణ ఉపవాసము : ఈ తరహా ఉపవాసము చేసేవారు మంచి నీళ్ళు కూడా తాగరు . పానీయాలతో ఉపవాసము : ఇందులో ఘనపదార్ద ఆహారానికి బదులు మంచి నీళ్ళు , పండ్లరసాలు , టీలు , కాఫీలు , పానకము మున్నగు ద్రవరూప ఆహారం తీసుకుంటారు .
వండని పదార్దాలలో ఉపవాసము ఇందులో ఆహారానికి బదులుగా పండ్లు , పచ్చి కూరలు , వడపప్పు , చెరుకు ముక్కలు … వండని ద్రవపదార్దములతో కలిపి (సహా) తీసుకుంటారు . వండిన , ఉడికించిన పదార్దాలు తీసుకోరు . వండిన ఆహారముతో ఉపవాసము : ఈ తరహా ఉపవాసము లో ఉడికించిన కూరగాయలు , గింజలు తో సహా అన్ని పానీయాలు తీసుకుంటారు . ఉపవాస విధానాలు : ఉపవాసము ఒకరోజు నుంచి అనేక రోజులు చేయవచ్చును . ముందు తక్కువ సమయం ఉపవాసము చేసి ఆ తర్వాత ఎక్కువ రోజులు చేయడానికి ప్రయత్నించాలి . భోజనము లేదా ఆహారము లో కొన్ని పదార్ధాలను మినహాయించుకొని ఉపవాసం చేయుట . రోజులో ఒక పూట ఉపవాసము , ఒక రోజు అంతా ఉపవాసము చేయుట , వారాంతం ఉపవాసాలు … వారానికి ఏదో ఒకరోజు ఉపవాసము చేయుట-క్రమము తప్పకుండా చేయుట , పండగ , పుణ్య . పవిత్ర దినాలలో ఉపవాసము చేయుట – ఇది ఒక క్రమ (regular) పద్దతి లో ఉండదు , ఉపయోగాలు : లంకణం పరమౌషధం కాబట్టి …మన జీర్నశాయానికి కొంచెం విశ్రాంతి ఇవ్వడం ద్వారా అది మరింత చక్కగా పనిచేయడానికి దోహదపడం.. ఉపవాస కాలము లో శరీరము స్వస్థత పొందడం ప్రారంభమవుతుంది , జీర్ణ వ్యవస్థ , జీర్ణక్రియ మెరుగు పడుటుంది . , రోగనిరోధక వ్యవస్థ ప్రచ్చన్నమవుతుంది.







భార్య, భర్తకు ఎడమ పక్కనే ఉండాలి:-

సమస్త పూజాదికాలు నిర్వహించే టప్పుడు, దానాలు,ధర్మాలు చేసే సమయాన భార్య, భర్త ఎడమవైపున ఉండాలి.

కన్యాదాన సమయాన, విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడి వైపున ఉండాలి. బ్రహ్మ దేవుడు మగవాడ్ని కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చేపుతున్నంయి. 

శ్రీ మహా విష్ణు శ్రీ మహా లక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకుంటాడు.










ఆడ‌వారు గాజులు ధరించ‌డం:-

ఆడ‌వారు గాజులు ధరించ‌డం వెనుక‌… పురాత‌న కాలంలో కేవ‌లం మ‌గ‌వారే బ‌య‌టికి వెళ్లి శారీర‌క శ్ర‌మ చేసేవారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే మ‌హిళ‌లు ఎప్పుడూ ఇంటి ప‌ట్టునే ఉండి త‌క్కువ‌గా శ్ర‌మిస్తారు కాబ‌ట్టి వారికి గాజుల‌ను ధ‌రింప‌జేసే వారు. దీంతో ఆ గాజుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ట‌. గాజులు ఎల్ల‌ప్పుడూ చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌. అంతే కాకుండా ఆడ వారి శ‌రీరం నుంచి విడుద‌ల‌య్యే నెగెటివ్ శ‌క్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజుల‌ను ధ‌రింప‌జేసే వారు.












ముక్కు పుడక ధరించ‌డం:-

ముక్కుకి ఎడమ వైపున చంద్ర నాడి ఉంటుంది.కనుక ముక్కుకు ఎడమ వైపున అర్థ చంద్రాకారంలోని బేసరి ధరించాలి. కుడివైపు సూర్యనాడి ఉంటుంది. కాబట్టి కుడి వైపున మండలాకారమైన ఒంటి రాయి బేసరి ధరించాలని శాస్త్రోక్తం. మధ్యలో ముక్కెర ధరించాలి. ఇది సాధారణంగా ముత్యం లేదా కెంపు ని బంగారం తో చుట్టించి ధరిస్తారు. ముక్కుకి ఎడమవైపున ధరించే ముక్కు పుడక లేదా ముక్కు బేసరి వల్ల ఆడవారికి గర్భకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి. పురుటి నొప్పులు ఎక్కువగా కలుగకుండానే సుఖప్రసవం అవుతుంది. కన్ను, చెవి కి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. చెవిపోటు, చెవుడు వంటివి కలుగ కుండా ముక్కుపుడక కాపాడుతుంది. శ్వాస సంబంధమైన వ్యాధులు కలుగవు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెరుగు పడుతుంది .











పిల్ల‌ల‌కు చెవులు కుట్టించ‌డం:-

చిన్నారుల‌కు చెవులు కుట్టించ‌డం స‌హ‌జ‌మే. ప్ర‌ధానంగా ఆడ‌పిల్ల‌ల‌కు, ఆ మాట‌కొస్తే కొంత మంది మ‌గ పిల్ల‌ల‌కు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి దాంతో వారికి వ‌చ్చే అనారోగ్యాలు పోతాయ‌ట‌. ప్ర‌ధానంగా ఆస్త‌మా వంటి వ్యాధులు రావు‌.











కాలి వేళ్ల‌కు మెట్టెలు ధ‌రించ‌డం:-

హిందూ సాంప్ర‌దాయంలో పెళ్ల‌యిన మ‌హిళ‌లు కాలికి మెట్టెల‌ను ధ‌రిస్తారు. ఇలా ధ‌రించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి వారి గుండె నుంచి గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. దీంతో వారి రుతు క్ర‌మం స‌రిగ్గా ఉంటుంద‌ట‌. అయితే వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్ర‌కృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ట‌. వివాహిత స్త్రీలు కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవడం ఆచారం. వాడుకలో 'మెట్టెలు'గా ఉన్న ఈ పదం నిజానికి 'మట్టెలు'. కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. ఇలా అనుకోవడానికి కారణం ఓ పురాణగథ. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయణి, తన కాలివేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. దీనిని అనుసరించే పై నమ్మకం ఏర్పడింది. అందుకే వివాహిత స్త్రీలు మెట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చింది. 









సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన స్త్రీలుకాళ్లకు మెట్టలు ధరిస్తారు… ఇది కేవలం ఆమెకు పెళ్లి అయ్యిందని సూచించడమే కాదు. దానికి ఓ ప్రత్యేకత ఉంది.సాధారణంగా స్త్రీలు కాలి రెండవ వేలికి మెట్టెలు ధరిస్తారు. కాలి రెండవ వేలి నుండి ఓ ప్రత్యేక నరం గర్భాశయానికి సంధి చేయబడి గుండె వరకు వెళుతుంది. ఈ వేలికి మెట్టె పెట్టుకోవడం వల్ల గర్భాశయం ధృఢపడుతుంది. ఇది రక్తప్రసరణను నియంత్రించి రుతుచక్రం సక్రమంగా వచ్చి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల..భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరమునకు ప్రసరింపజేస్తుంది..అందుకే వెండితో చేసిన మెట్టలను మన భారతీయ స్త్రీలు కాలి రెండవ వేలుకు ధరిస్తారు.










శుభాలు పొందుటకు స్త్రీలు పాటించవలసిన కొన్ని నియమాలను విధించారు మన పెద్దలు. భర్త అనురాగం పెరగటానికి సంతానభాగ్యానికి సిరిసంపదలు పొందటానికి వ్యాధులు రాకుండావుండటానికి ఈనియమాలు పాటించి చూడండి.


1. మంగళ సూత్రం లో పిన్నీసులు వుంచరాదు అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి వుంచుతారు .మంగళ సూత్రం వేదమంత్రాల సహితంగా ప్రభావితము కాబడిన భర్త ఆయువు పట్టు.మంగళ సూత్రము రూపములో హృదయం వద్ద చేరివున్నది. ఇనుప వస్తువులు[పిన్నీసులు ,ఇనుముతో చేసినవి] దివ్యశక్తులను ఆకర్షించుకొను గుణముకలవి. కనుక అవి మంగళ సూత్రము లో దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి .భర్తకు అనారోగ్యం ,భార్యాభర్తలపట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి. కనుక వెంటనే ఈ అలవాటు వెంటనే సరి చేసుకోవాలి.




2. స్త్రీలు ధరించే గాజులు మట్టిగాజులై వుంటె చాలామంచిది. . ఈగాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక ,వీని శబ్దము శుభాలను ,అనురాగాలను పెంచుతుంది.




3.ఇంట్లో గుర్రం బొమ్మలు వుంచుట అంత క్షేమము కాదని డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలామంది నమ్మకం .
4.సంపదలను ,ఎక్కువగా ప్రదర్షించటం వలన నరఘోష ఏర్పడుతుంది .తద్వారా చెడు జరుగుతుంది. కనుక [అలంకారాదులు]సాధారణం గా వుండేలాచూసుకోవటం సాధారణ జీవిత విధానాన్ని పాటింఛటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు..





5. పిల్లలు తమ మాటవినలేదనేవారు ఈ చిన్నచిట్కాలు పాటించి చూడండి. ఆడపిల్లలకైతే ఐదుపోగుల ఎర్రదారం కుడిభుజమునకు కట్టి కుంకుమ బొట్టు పెట్టుకునే అలవాటు చేయండి . అలాగే మగపిల్లలైతే ఆకుపచ్చదారం తొమ్మిది పోగులు వేసి కుడిభుజానికి కట్టి గంధమునుదుట ధరించటం అలవాటు చేసి చూడండి పిల్లలు మీ మాటను శిరసావహిస్తారు.






6.ఆడపడుచులు ,అత్తమామలతో విబేధాలు ఎక్కువైతే ,వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పనుకునేదిండు క్రింద తులసి వేరు వుంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగాచూసుకుంటారు విరోధాలు తగ్గుతాయి.



7. వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి వంటకాలు ఎంతో రుచిగాను ఆరోగ్యకరం గాను వుంటాయి. పని మనిషిరానప్పుడు విసుగుచెంది కోపంతో బాధపడేకంటె ,పనిమనిషికంటే నేనే శుభ్రంగా గిన్నెలు శుభ్రం చేసుకుంటాను,వాల్లకంటె నేనైతే శుభ్రంగా వుంచుకోగలనని[ నిజాన్ని] మనస్సుకు పదేపదే చెప్పుకుని మీరు మీపనిని చేసుకునే ప్రయత్నం మొదలెట్టండి అసలు పనిమనిషిని మానిపించాలనే అని పిస్తుంది మీకు.




8.భర్త తాగి వచ్చి హింసపెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒకచిన్నస్పూన్ [అంటె సుమారు అరగ్రాము] కరక్కాయ పౌడర్ ను ఆరు చెంచాల నీటి లో కలిపి త్రాగించండి. ఇలా అరవై రోజులు చేస్తే వాల్లకు తాగుడు పై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలామంచిది ,నల్లవెంట్రుకలను కూడా తెల్లబరుస్తుంది .మొదట దీనిని త్రాగనని మారాం చేస్తారు. కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటూ చేయండి ఈ ఔషధాన్ని.తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు.





9.సుఖసంతోషాలు కరువైనవారు పసుపురంగుపూలు ధరించండి ,క్రమేపీ స్థితి మెరుగవుతుంది.


10.అప్పుల బాధ ఎక్కువగావుంటె తెలుపు పూలు ధరించటం వలన రుణబాధలు తగ్గుతాయి.


11.ఆరోగ్యం సరిగాలేనివారు ,శరీరం నొప్పులు వున్నవారు మరువం ,మందారాలు కలిపి ధరించండి ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.


12. పెల్లిచూపులప్పుడు ఎరుపు పూలు ,పసుపు పూలు కలిపి మాలకట్టి దరించండి వివాహం విషయం లో కన్యలకు ఎంతో శుభకరం గా ఫలితాలొస్తాయి.



13.మంచి తీర్ధం లో రెండు తులసి దలాలు వేస్తే అవి మానససరోవర జలాలంత పవిత్రమవుతాయి.



14.కూర్చునే పీఠమునకు శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి. చాపైతే విభూది బొట్లు గుడ్డను ఆసనంగావాడితే కుంకుమ బొట్లను పెట్టండి .



15.భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే గుండీలు మీరు పెట్టండి . మీకుడు చేతితో తాకి వెళ్లమనండి.భర్తలకు ఆరోజు సంపాదనా ,విజయము సంతోషము వెంటనుంటాయి.



స్త్రీలు చేయ తగిన చేయ కూడని పనులు:-

స్త్రీలు ఎప్పుడు గుమ్మడి కాయను కొట్టరాదు ఎందుకంటె గర్భ సంచి కిందికి జారిపోయే అవకాశములు ఎక్కువ.

గర్భిణి స్త్రీలు శూర టెంకాయ, తమిళంలో చిదరు కాయ్ అంటారు దానిని కొట్ట కూడదు ఎందుకంటె అదురుడుకు గర్భము జారిపోవచ్చు, అదే మాదిరి శూర టెంకాయ కొట్టే స్తలములో కూడా ఉండకూడదు.


గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవ్వడానికి కావలసిన ఆమ్లములు ఉండవు .అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు.


మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును.



మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను.


మీరు మీ పిల్లలు దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరూ దీనిని తప్పక చేస్తుంటారు.


స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు.


దుఃఖము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు. అలాగే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్ప కూడదు. ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు .అపరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది.


కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి, పసుపు క్రిమి నాసిని.


ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది.


నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది.



ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు ,కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు .ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము.



ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి, ఇది పితృ దేవతలకు ప్రీతి .కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి.




టెంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.



స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు .ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది. ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది.



శుక్రవారమునాడు గాని ,జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పై పై డబ్బులు చేరటానికి అవకాశము ఎక్కువ.



కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాళ్లాడిస్తూ కూచోవడం, ఒంటి కాలితో నిలవడం, స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ







ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ,ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.


సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి వేరే చోట పడుకొనరాదు ,  భర్త పడుకున్న చోటనే  బార్య నిద్రించాలీ. అలిగి ఆహారము తినకుండా నిద్రించ కూడదు. ఇది కుటుంభనాశనానికి దారి తీయిను.



స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు ,రేపు తీసుకుంటాను అని అనవలెను.



ఎప్పుడు మన నోటినుండి పీడ ,దరిద్రం, శని పీనుగా కష్టము, అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు.


ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువులు, పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.


శ్రాద్ధ దినమందు ఇంటి ముందు ముగ్గు శ్రాద్ధము అయ్యేవరకు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను.


దిండులు, ఓర దుప్పట్లు అప్పుడప్పుడు ఉతుకుతూ వాడాలి .మనకు తెలియని సుక్ష్మ క్రిములు చాల ఉంటాయి దాని వాల్ల మనకు హాని జరుగును










19 September 2016

సహాయం.

ఈ కథ ఏవరు రౌసారో తెలియదు.
కారు ఆగిపోయింది ,అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం ఆరు దాటుతోంది.
















నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు . చీకటి పడితే ఎలా? దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు ( సిగ్నల్స్ లేవు ). ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది.



















అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ? ఏమి చేస్తాడు .? ఆందోళన !. అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ? టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు ." భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు ఆమె భయపడుతూనే ఉంది . " నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను " అన్నాడు .అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి కారులో పెట్టాడు .. ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు ." మీరు కాదనకండి . మీరు ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది. " నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి " అని వెళ్లి పోయాడు... మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి.















అదొక చిన్న హోటల్ . కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లికావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తోంది . ఆమె ముఖం లో ప్రశాంత మైన చిరునవ్వు.ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ ? అని ఆశ్చర్య పడుతోంది తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000నోటు ఇచ్చింది . ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది . తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు .. ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు .అందులో ఇలా ఉంది. " చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు సహాయపడు . " అని రాసి ఉంది.. ఇంటికి వచ్చింది . అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది . గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది . అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులుపడుతున్నాం కదా డెలివరీకి డబ్బులెలాగా అని. ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్! భగవంతుడే మనకు సహాయం చేశాడు . ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా.











మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది అన్నది ఆ కధ యొక్క పరమార్ధం.

ఏశాస్తము చెప్పబడని దాంపత్యజీవితములోభార్య భర్తల బంధం

ఆర్థిక భారం మోసేది భర్త... కుటుంబ భారాన్ని మోసేది భార్య జీవనయానంలో ఇద్దరి ప్రాధాన్యం ఒకటే.
కుటుంబ రథం సాఫీగా సాగేది అప్పుడే సంప్రదాయ సంకెళ్లను దాటిరాని మగ మహారాజులు భార్య శ్రమను గుర్తించేది అతి తక్కువ మంది .










ఒక్క ప్రశంస ఆమె కష్టాన్నే మరిపిస్తుంది దూరమవుతున్న అనుబంధాల ఒడి సంప్రదాయ సంకెళ్లు తెగినా దొరకని ఊరట యాంత్రిక జీవనంలో దరిచేరని బంధాలు
నేడు భార్యను ప్రశంసించే రోజు... నువ్వంటే నాకిష్టం...నీ నవ్వంటే నా కిష్టం..." అంటూ రోజులో ఏదో ఒక సందర్భంలో భార్యతో అంటే ఆమె ఫీలింగ్‌ ఎలా ఉంటుందో గమనించండి. ఆమె మురిసిపోతుంది. మైమర్చిపోతుంది. ఎందుకంటే ‘ఆమె’ కోరుకునేది అదే. ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది’ అన్నమాట కాగితాలకే పరిమితం చేసే మనం ఆమె కష్టాన్ని మరిపించే ఒక్క మాటైనా మాట్లాడడానికి ‘అహం’ ఫీలవుతాం.










కుటుంబ భారాన్ని మోసేది భర్త...కుటుంబాన్ని నడిపించేది భార్య...ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. కాలంతోపాటు వచ్చిన మార్పుల్లో ఇప్పుడు దంపతులిద్దరూ బాధ్యతలను, భారాన్ని సమానంగా పంచుకుంటున్నారు. అటువంటప్పుడు ప్రశంసలు కూడా ఇద్దరికీ దక్కాలి. అదే అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం. మనకోసం అనుక్షణం కష్టపడే భార్యను ప్రశంసించడం భారం కాదు...బాధ్యత. కుటుంబమనే రథానికి భార్యభర్తలు జోడుగుర్రాలు. ఒకేలా సాగితేనే ప్రయాణం సాఫీ అవుతుంది. కష్టం ఇద్దరిదీ అయినప్పుడు ప్రశంసలు ఒక్కరికే పరిమితం కాకూడదు.










భర్త తన భార్యను మరో తల్లిగా భావిస్తే... భార్య తన భర్తను తొలిబిడ్డగా భావిస్తుందట. అటు వంటి దాంపత్యంలోనే అన్యోన్యత వర్థిల్లుతుంది. అనుబంధం కలకాలం నిలవాలంటే పొగడ్తలు, ప్రశంసలే టానిక్కులు. కాపురంలో ఈ చికిత్స ఎన్నాళ్లు కొనసాగితే ఆ దాంపత్యం అన్నాళ్లు ఆరోగ్యంగా ఉంటుంది. భర్త నోటి నుంచి వచ్చే చిన్న ప్రశంసను భార్య ఓ వరంలా భావిస్తుంది. అందుకోసం ఎదురు చూస్తుంది. దానికి ఉన్న మహత్యం అటువంటిది. ప్రశంస ప్రాధాన్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకే ఏటా సెప్టెంబర్‌ 18న ‘భార్యల ప్రశంసల దినోత్సవం’ జరుపుకొంటారు. నేడు భార్యను ప్రశంసించే రోజు సందర్భంగా ప్రత్యేక కథనం ఇది.
తోడు...నీడ పరమశివుడ్ని అర్థనారీశ్వరుడంటారు. భార్యను తన అర్థభాగం చేసినందుకు ఆయనకు దక్కిన గౌరవం ఇది.









సృష్టిస్థితిలయకారకుడైన భగవంతుడే భార్యకు అర్థభాగమిస్తే సామాన్యమానవులం మనం మాత్రం ‘ఆమె’పట్ల నిర్లక్ష్యం చూపుతుంటాం. ప్రతి దాంపత్యంలోను భార్యాభర్తలిద్దరూ సరిసమాన పాత్రధారులు. భార్యాభర్తలు తోడూనీడ వంటివారు. మెట్టినింట అడుగుపెట్టిన మహిళకు తొలిరోజుల్లో భర్తే సర్వస్వం.ఇల్లే స్వర్గంగా...భర్త, పిల్లలే దేవుళ్లుగా భావిస్తుంది. తెల్లవారు జామున నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి తొలిజామున నిద్రపోయే వరకు ఎంతో శ్రమిస్తుంది. రుచికరమైన వంట చేసి వడ్డించడం నుంచి ఇంటిని అందంగా అలంకరించుకునే వరకు అన్నింటా ఆమె ప్రాధాన్యం స్పష్టంగా కనిపిస్తుంది. భర్తను మురిపించాలని, మెప్పించాలని ఆశిస్తుంది. ఆయన ప్రశంస కోసం ఎదురు చూస్తుంది. కానీ ఆమె కష్టాన్ని, శ్రమను గుర్తించే మగ మహారాజులు అతి తక్కువంటే అతిశయోక్తి కాదు. ఆఫీసులో తామే కష్టపడుతున్నామని, భార్య ఇంట్లో ఉండి చేసేదేముందిలే అన్న భ్రమలో బతికేస్తుంటాం. ‘శభాష్‌...బాగా చేశావ్‌’ అన్న ఒక్కమాట కోసం ఆమె ఎదురుచూస్తోందన్న విషయాన్ని గుర్తించరు.
ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎదురుచూపు ఎప్పుడు ఫలించినా ఆమె కష్టం అప్పటితో మర్చిపోతుంది. లేదంటే మరో రోజుకోసం ఎదురు చూస్తుంది. యాంత్రిక జీవనం ఒకప్పుడు సంప్రదాయ సంకెళ్లు...ఇప్పుడు యాంత్రిక జీవనం...మహిళకు శాపం అనవచ్చు. ఒకప్పుడు భర్తే దైవం...ఆయన మాటే వేదం...భార్య వంటింటికే పరిమితం అన్న పెద్దలమాట వల్ల భార్య కష్టానికి గుర్తింపు లేకుండా పోయేది. కాలంతోపాటు మహిళ ప్రాధాన్యం పెరిగినా ఆమె కష్టానికి తగిన గుర్తింపు మాత్రం లభించడం లేదు. యాంత్రిక జీవనంలో పడిన మనిషి బంధాలు, అనుబంధాల ఒడిని చేరుకోలేకపోతున్నాడు. సంపాదన యావలో పడి.. భార్యాపిల్లలకు ప్రేమ, ఆప్యాయతలుపంచే బాధ్యతను విస్మరిస్తున్నాడు ‘అహం’ అనే చట్రంలో చిక్కుకున్న ఎందరో భర్తలు కనీసం ‘బాగాచేశావ్‌’ అన్న మాటకూడా అనడానికి ఇష్టపడడం లేదు. ఎవరిపని వారిదే అన్నట్లు అంటీ ముట్టనట్లు వ్యవహరించే దంపతులు ఎందరో తారసపడుతున్నారు.









పెళ్లి అనే ‘బంధం’లో తప్ప ఆప్యాయతా అనురాగాల ‘అనుబంధం’ను పెంచుకోలేకపోతున్నారు. నిర్లక్ష్యం...అహం..అవగాహన.... లేక పోవడము. భార్యంటే అన్నింటా తనకంటే తక్కువని, ఇంటి యజమానిగా తను గీసిన గీతే శాసనమని, కుటుంబ సభ్యులెవరికీ ఎదురు చెప్పే హక్కులేదని, భార్యంటే వంటింటికే పరిమితం కావాలన్న సంప్రదాయ వాదులు ఇప్పటికీ మనకు తారసపడుతుంటారు. పుట్టుకతో వచ్చిన అహం, నిర్లక్ష్య భావంతో కొందరు భార్యను ప్రశంసించేందుకు ఇష్టపడరు. భార్య శ్రమను గుర్తించకపోగా, అది ఆమె బాధ్యతగా భర్తల ఆలోచన. ఇటువంటి దంపతుల మధ్య బంధం కూడా అంతే కృత్రిమంగా ఉంటుంది. సంప్రదాయ సంకెళ్ల మధ్య బందీలుగా తప్ప ఆప్యాయ తానురాగాల బంధం వారి మధ్య కనిపించదు. అదే భార్యచేసే పనిలో కష్టాన్ని, ప్రేమను, ఆప్యాయతను, బాధ్యతను గుర్తించి గౌరవించే భర్తకు ఆమె మనసులో శాశ్వత స్థానం లభిస్తుంది. ఆ భర్తపట్ల ఆరాధన, గౌరవం పెరుగు తుంది.సందర్భం వచ్చినప్పుడల్లా... భార్యను ప్రశంసించడంలో కృత్రిమత్వం ఉండకూడదు. మీరిచ్చే కాంప్లిమెంట్‌లో వంద శాతం నిజాయితీ కనిపించాలి. సందర్భానికి తగ్గట్టు ప్రశంస ఉంటే ఆమె మురిసిపోతుంది. మైమర్చి పోతుంది. మీపట్ల ఆరాధన పెంచుకుంటుంది. భార్య పదిరోజులు పుట్టింటికి వెళ్లింది. చేతిపాకమో, హోటల్‌ తిండితోనే గడిపిన మీరు ఆమె తిరిగి వచ్చాక చేసిన వంట తింటూ ‘మళ్లీ నోటికి జీవం వచ్చింది. నీ చేతి వంట తినకుంటే నాకు ఏదోలా ఉంటుంది’ అంటూ ప్రశంసించి చూడండి. ఆమె మోము అరవిరిసిన మందారంలా విచ్చు కుంటుంది. ఆ ప్రశంసలో వందశాతం నిజాయితీని ఆమె గ్రహిస్తుంది. అందుకే టీ, టిఫిన్ పెట్టినప్పటి నుంచి రాత్రి పడుకునేముందు వరకు ఏదో ఒక సందర్భంలో భర్తగా ఆమె మనసుకు సాంత్వన పలికే ఒక్క మాట చాలు ఆమె తన రోజంతటి కష్టం మర్చిపోయేందుకు. ఆలోచనా విధానం మారాలి..., భార్య అనగానే వంటపని, ఇంటిపని చూసుకునే మహిళ అన్నది సగటు భర్త ఆలోచన. ఈ విధానం మారాలి. 







ఆఫీసులో భర్త చేసే పనికంటే పది రెట్లు ఎక్కువ పని ఇంట్లో భార్య చేస్తుందని గుర్తించాలి. పిల్లల్ని సాకడం, ఇంటి పనులు చేయడమే భార్య విధి అని, మరెందులోనూ జోక్యం చేసుకోకూడదన్న కొందరి అభిప్రాయం. కానీ ఇది తప్పు. కుటుంబ విషయాల్లో ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. పదిమందిలో ఉన్నప్పుడు ఆమె గురించి రెండు మంచి మాటలు చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె ‘ప్రాధాన్యం’ గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పిల్లల వద్ద చెబితే ఆమె తన కష్టాన్ని మర్చిపోయి కుటుంబం కోసం మరింత కష్టపడుతుంది. ‘ఇదేం గొప్పా...ఇంతేగా నువ్వు చేసేది’ వంటి పదాలు వాడక పోవడం మంచిది.
సమస్యలు...సూచనలు..... దంపతుల మధ్య ప్రతి విషయంలోనూ నిజాయితీ కొనసాగాలి. నిజాయితీగా వ్యవహరించనప్పుడు మనస్పర్థలు సహజం.సందర్భం ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. అవగాహనతో వ్యవహరించాలి. ఎవరివల్ల సమస్య ఎదురైనా పరస్పరం చర్చించుకుని పరిష్కారానికి మార్గాలు వెదకాలి. సాకులతో ఒకరిపై ఒకరు నెట్టుకోవడం వల్ల పరిస్థితి జఠిలమవుతుంది.పుట్టి,పెరిగిన వాతావరణం వేరుగా ఉండడం, మెట్టినింట వాతావరణం భిన్నంగా ఉన్నప్పుడు అలవాటుపడేలా ప్రోత్సహించాలి.
అర్థం చేసుకునేలా కౌన్సెలింగ్‌ చేయాలి. తూలనాడడం, చిన్నబుచ్చడం మంచిదికాదు.ఉద్యోగులైతే మిస్‌ అండస్టాండింగ్‌కు దూరంగా ఉండాలి. సమయపాలన విషయంలో పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించాలి. అపోహపడితే ఇబ్బందులే.పని విభజన చేసుకుని పరస్పరం సహకరించుకోవాలి తప్ప ‘నీదే బాధ్యత’ అన్న మాట రాకూడదు.లైంగికపరమైన అపోహలను దరిచేరనివ్వకూడదు. సమస్య ఉంటే సైకాలజిస్ట్‌ను సంప్రదించి పరిష్కరించుకోవాలి తప్ప ‘నువ్వే కారణం’ అనకూడదు.







వ్యవసానాలకు బానిస కావడం, బాధ్యతలేకుండా వ్యవహరించడం, ఆర్థిక ఇబ్బందులు సమస్యకు కారణం. ...ఎదురుచూపు గుర్తించాలి...., ఇంటిపనితో ఎంతో సతమతమయ్యే భార్య రోజులో ఒక్క సందర్భంలోనైనా భర్త ప్రశంస కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూపును గుర్తించినప్పుడే ఆమెపట్ల మనకున్న నిజమైన ప్రేమ బయటపడుతుంది. తమకోసం తన సర్వస్వంధారబోసే భార్య ఎదురు చూపును గుర్తించడం మర్చిపోతుంటారు. దీంతో ఆమె మనోవేదన అనుభవిస్తుంది. ఆమె పడుతున్న మనోవేదననూ గుర్తించలేని వారు ఎందరో ఉన్నారు. ‘ప్రత్యేకం’గా గుర్తుంచుకోవాలి...... భార్యకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను, రోజులను గుర్తుంచుకోవాలి. పుట్టిన రోజు, పెళ్లిరోజు, ముఖ్యమైన రోజులను గుర్తుంచుకుని విష్‌ చేస్తూ ఉండాలి.








రోజులో ఒక్కసారైనా ప్రేమగా నవ్వుతూ మాట్లాడాలి. వారానికి ఒక్కసారైనా భార్యను, పిల్లలను బయటకు తీసుకువెళ్లాలి. దంపతుల్లాకాకుండా స్నేహితుల్లా మెలుగుతూ కష్టసుఖాలను పంచుకోవాలి. ఒకరికి కోపం వస్తే మరొకరు తగ్గాలి. అప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. అనుక్షణం గుర్తుంచుకోవాలి..,..... భార్యను అనుక్షణం గుర్తుంచుకో వాలి. ఆమెకు సంబంధించిన విష యాల్లో ప్రత్యేకంగా విష్‌ చేయడం ద్వారా ఆమె మనసు చూరగొన వచ్చు. రోజులో ఒక్క క్షణమైనా భార్యతో ప్రేమగా మాట్లాడి ఆమె అవసరాలు అడిగి తెలుసుకోవాలి. చేసే పనిలో కాస్తంత ప్రేమను చూపించి బాగుందంటూ ఆమెను మెచ్చుకోవాలి. ఏ సందర్భం లో నైనా భార్యను నొప్పించకుండా ఆమె మనసు తెలుసుకుని మాట్లాడగలిగిన వ్యక్తే భర్తగా వందశాతం మార్కులు సాధించి నట్టు. మాట్లాడేటప్పుడు సునితత్వాన్ని ప్రదర్శించాలి. ఆమె పట్లే కాదు ఆమె బంధువులను, కుటుంబ సభ్యుల గురించి కూడా తక్కువచేసి మాట్లాడకూడదు. దానివల్ల ఆమె చిన్నబుచ్చుకునే అవకాశం ఉంది. ..గుర్తింపును ఆశిస్తారు....
భర్త ప్రశంసలు, పొగడ్తలను ప్రతి భార్య కోరుకుంటుంది. తను చేసే ప్రతిపనికి గుర్తింపును ఆశి స్తుంది. రోజులో ఒక్కసారైనా భర్త నుంచి ‘బాగుంది’ అన్న మాట కోసం ఎదురు చూస్తారు. భార్యను ప్రత్యేకంగా చూడడంతోపాటు వారి లో ఉన్న ప్రత్యేకతను గుర్తించాలి. వీలైనప్పుడల్లా వారితో మనస్ఫూర్తిగా మాట్లాడుతూ పనిలో సాయాన్ని అందిస్తూ ఉండడం ద్వారా ఆనందంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. భర్త, పిల్లల కోసం, కుటుంబం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసేది భార్య మాత్రమే. అటువంటి భార్యను వీలున్నప్పుడల్లా ప్రశంసించడం, ప్రత్యేకంగా అభినందించడం వల్ల పోయేదేమీ ఉండదు. అలా చేయడం వల్ల దాంపత్య బంధం బలపడుతుంది.






ప్రాతః కాలమున నిద్రనుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి, కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలయును.
పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తమనేక ఘనకార్యములు చేసిన కాని మంచి ఫలము పొందలేక పోవుచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలయును గాని, అందాన్ని ఆకారాన్ని చూచి మోసపోకూడదు. అటులనే పురుషులునూ స్త్రీయొక్క అందమునే చూడక, శీలము, గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆవిధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగముతో కాపురము చేసిన యెడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏవిధంగా ప్రేమతో సేవిన్చునో ఆ విధంగానే అత్తమాలల సేవ, అతితిసేవలయందు కూడా తగు భక్తిశ్రద్ధలతో చేసినయెడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును అని పురాణాలు చెపుతున్నాయి.








ప్రతి పురుషునకు తనకనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికీ ఉదాహరణగా స్త్రీయెటులుండవలయుననగా –
శ్లో: కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా
శయనేషు రంభా రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ!
ఇవి ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించియున్నారు. అనగా యింటి పనులలో దాసీవలెను, రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లి వలెను, రూమున లక్ష్మి వలెను, శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ ఆరువిధముల వ్యవహరింప వలెను.
అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థము, కామము, మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనెంచిన మిగతా మూడున్నూ అనవసరం. ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏవిధంగా సాధించునో కామమును గూడా అట్లే సాధించవలయును. ప్రతి మానవుడు వివాహం చేసుకొనే ముందు కన్యయోక్క గుణగణములు తెలుసుకొనవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమయినది. కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు.









గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక, అట్టి మనుజుడు ధర్మ-అర్థ-కామ-మోక్షములను అవలీలగా సాధించగలడు.
భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదై యున్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములనుభవించుచు మరల నరక కూపమునకే పోగలడు. గనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులన కన్య ఆరోగ్యవతియై యే విధమైన రోగాగ్రస్తురాలై ఉండకూడదు. యెంత అందమయినదైననూ మంచి కుటుంబములోని కన్యయై యుండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి, దేవా బ్రాహ్మణులను పూజించునదియై, అత్తమామల మాటలకు జవదాటనిదై యుండవలెను. 
ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు. గాన అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలయును
భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలె సలహాలివ్వవలయును.
పనిపాటల యందు సేవకురాలి వలె నడుచుకొనవలయును.
భోజనం వద్దిన్చునప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టులో ఆవిధంగా భర్తకు భోజనం వడ్డించవలెను.
శయన మందిరమున వేశ్యవలె భర్తకు ఆనందం కలుగజేయవలయును.
రూపంలో లక్ష్మిని బోలియుండవలెను.
ఓర్పు వహించుటలో భూదేవిని బోలియుండవలెను.
ఈవిధంగా ఏ స్త్రీ నడచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును.





స్త్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాటలాడ కూడదు. ఎవరినీ ముట్టుకొన రాదు. అ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. నాలుగవ రోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్ళు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలయును.
ఎటువంటి సమయమునందైననూ భర్త భుజించకుండా తాను భుజించకూడదు.












భార్య భర్తల మద్య ఉండకూడని మాటలు
భార్య భర్త తో అనకూడనివి :
1) మరో జన్మ ఉంటె నువ్వు మాత్రం నాకు వద్దు. ……
2) నువ్వింతే ఎప్పుడూ…నిన్ను చేస్కున్నాను చూడు … నన్ననుకోవాలి.
౩)మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది ….ఎప్పుడోకప్పుడు నువ్విలా చేస్తావని .
4)ఇతని వల్ల మళ్ళీ ప్రాబ్లం వచ్చేలా ఉంది (ఫ్రెండ్స్ తో భర్త ని ఉద్దేశించి ).
5)మీ నాన్న లాగే నువ్వు కూడా…అంటూ దెప్పి పొడిచే మాటలు.
6) కొత్త జాబ్ ఎప్పుడు వెతుక్కున్టావ్.
7)చేస్కున్నోళ్ళకి చేస్కున్నంత … ఇలాంటి మొగుడు వస్తాడని  మాత్రం అనుకోలేదమ్మా …(మంచిగా ఉన్నా కూడా అంటుంటారు కొంతమంది ).
8)అన్నీ బాగానే ఉన్నాయ్ …ఆ ఆరో లక్షణమే సరిగ్గా లేదు (దేన్ని ఉద్దేశించి అంటారో వాళ్ళకే తెలీదు).
9)కాళ్ళ కింద శని పెట్టుకుని నడుస్తుంటే ఎవరేం చేస్తారు ….. దమ్మిడీ లేదు కాని మాటలు మాత్రం మాట్లాడతాడు.
10 ) నేను తప్ప అందరూ ఆయనకి అందం గానే కన్పిస్తారు. చూడడానికి అలా ఉన్నాడు కాని వదిలేస్తే దేశాల్ని దోచేయ్యడూ ….
ఇలాంటి మాటలు భార్య భర్త ని అస్సలు అనకూడదు.  మరీ చెడ్డ వాడైతే ఒక రకం . కాని ప్రతి ఒక్క దానికీ సూటి పోటి మాటలతో వేదిస్తూ ఉంటారు ఇలా చాలా మంది. ఆడం టీసింగ్ లాగా ….
తప్పు చెయ్యని వాడు ఈ మాటలు పడ్డప్పుడు చాలా హార్ట్ అవుతాడు . అది వాళ్ళ మానసిక ఒత్తిళ్ళకి కారణం అయ్యి చాలా కాలం వేదిస్తూ ఉంటాయంట.
భర్త భార్య తో అనకూడనివి :
1) నీకెందుకే డబ్బుల విషయాలు …
2)అనవసరమైన విషయాల్లో జోక్యం చేస్కోకు.
౩)నీ ఇష్టాలేమన్నా ఉంటె నీలోనే ఉంచుకో…నా పై రుద్దకు.
4)డబ్బులేమన్నా చెట్లకి కాస్తున్నాయా…. సంపాదిన్చేవాడికి తెల్సు డబ్బు విలువ
5)బోడి నువ్వు తెచ్చిన కట్నానికి నా మీదే అజమాయిషీ నా …. (ఇలాంటి ప్రబుద్దులూ లేకపోలేదు ).
6) ఇంట్లో మహారాణి భోగాలు అనుభవించింది కదా…. ఇక్కడ మనపై చూపుతుంది అంతే. ( నువ్వింతే ..నీకంత సీన్ లేదు అని చెప్పడం )
ఇలాంటి మాటలే ..సంబందాలు చెడేలా చేస్తూ ఉన్నాయ్. మనల్ని నమ్మి వచ్చిన భార్యని ,మనతో జీవితాన్ని పంచుకునే భర్తని సూటిపోటి మాటలు తో వేధించడం అనేది  చాల భాదాదాయకం .
కొట్టినా ఆ దెబ్బ కొన్ని క్షణాల నుండి కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది … కాని సూటి పోటి మాటలు అనేవి మనసుకి తగుల్తాయి . తగ్గడానికి చాలా రోజులు…కొన్ని సార్లు సంవత్సరాల సమయం …కొన్ని సార్లు జీవితాంతం కూడా వేదిస్తుంటాయి ….










వివాహం అనేది స్వర్గంలో
నిర్ణయించబడుతుందని'' చాలా కాలం నుండి
ప్రాచారం పొందిన వ్యాఖ్య అవునా! నిజమే,
వివాహం అనేది జీవితంలో ఒకేసారి జరిగే మధుర
ఘట్టం. జీవిత కాలం పాటూ ఒకరికొకరు తోడు-
నీడగా ఉండే ఒక శుభకార్యం. నిబద్ధత,
భాగస్వామ్యం, బాధ్యత, నిజాయితీ వంటి పైన
మాత్రమే మీ సంబంధం కొనసాగుతూ
ఉంటుంది. కానీ, అటూ పెద్దలు నిశ్చయించిన
వివాహంలోనూ, ఇటూ ప్రేమ పెళ్ళిళ్ళలోనూ ఒకరి
పైన మరొకరికి నమ్మకం లేకనో, పెద్దలు చెప్పేది
వినకుండనో, అభిప్రాయ భేదాలు ఏర్పడి లేదా ఒకరి
అభిరుచులు ఇంకొకరికి నచ్చక, వారి
సంబంధాలు విడాకుల వరకు దారి తీస్తున్నాయి.
కానే కొంత మంది దంపతుల మధ్య
ఒడిదుడుకులు ఎదురైన కలిసి జీవిస్తున్నారు,
మరికొంత మంది విడాకుల ద్వారా విడిపోతున్నారు.
దంపతులు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి,
విడాకుల వరకు వెళ్లేందుకు గల ముఖ్య
కారణాల పట్టిక ఇక్కడ తెలుపబడింది.
ప్రాధాన్యతలు మరియు అంచనాలలో తేడా
దంపతుల మధ్య ఇద్దరు వేరు వేరు
ప్రాధాన్యతలను మరియు అంచనాలను కలిగి
ఉండటం వలన విడాకులకు ముఖ్య కారణంగా
చెప్పవచ్చు. ఈ విషయాలలో స్నేహితులు లేదా
పెద్దవారు చెప్పిన వినే పరిస్థితులలో వారు
ఉండరు కారణం వారి స్వతహాగా కలిగి ఉన్న
ఇష్టాలు, అహిష్టాలు, అహం వలన అని
చెప్పవచ్చు.




వ్యసనం
దంపతుల మధ్య కలిగి ఉండే వ్యసనాల వలన
ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. మీ
వ్యసనం వలన మీరు మాత్రమె కాకుండా,
అతడు లేదా ఆమె స్వతహాగా
భావించటమే కాకుండా, భాగస్వామి మరియు పిల్లల
ముందు తరచుగా భావోద్వేగానికి
లోనవుతుంటారు.





విసుగు పుట్టడం
వివాహం తరువాత కొంత కాలం పాటూ
దంపతులు ఇద్దరు సంతోషంగానే ఉంటారు,
కానీ కాలానికి అనుగుణంగా, వారి మధ్య అయిష్టత
మరియు దూరం పెరుగుతుంది. కారణం
ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోవటం. నూతనంగా
విడాకులు తీసుకునే ప్రతి జంట ఈ సమస్య
వల్లనే అని చెప్పవచ్చు.




విడాకులు తీసుకునే ముఖ్య 10 కారణాలలో ఇది
మొదటి కారణంగా చెప్పవచ్చు. వివాహం అంతరం
స్త్రీ మరియు పురుషులు ఇద్దరు శారీరక
సంతృప్తి కోసం పరితపిస్తుంటారు, కానీ
భాగస్వామి    లైంగిక
చర్యలలో స్త్రీ వలన  పురుషుడి అ సంతృప్తి  పుట్టడం ఇద్దరి
మధ్య చర్య విడాకుల వరకు దారి తీస్తుంది.
స్త్రీ లైంగిక పరంగా వారి
భాగస్వామి యొక్క అవసరాలను తీర్చాలి
విడాకులకు ముఖ్య కారణం
ఇదే అని చెప్పవచ్చు.


పిల్లల పెంపకంలో సమస్యలు
ఇద్దరు ఉద్యోగస్తులైతే ఇది ముఖ్య సమస్య
అని చెప్పవచ్చు, పిల్లల పెంపకంలో వారి మధ్య
ఉన్న అభిప్రాయ భేదాలు మరియు అహంకారాల
మధ్య పిల్లల పెంపకంపై ఇద్దరి మధ్య
భేదాభిప్రాయాలు ఏర్పడి విడాకుల వరకు దారి
తీస్తాయి. పిల్లల పెంపక విషయంలో ఇద్దరిలో ఉండే
వివధ ఆలోచనలు, వాటి అనుసరించే విధానాల వలన
ఇద్దరి మధ్య గొడవ జరిగి, విడాకుల వరకు దారితీసే
అవకాశం ఉంది.



ఆర్ధిక సమస్య
ఒక జంట విడాకుల ద్వారా విడిపోవటానికి ఆర్ధిక
సమస్య కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ
నూతన కాలంలో విడిపోయే వారి సంఖ్య ఈ కారణం
చేత అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.
నూతన కాలంలో విడిపోయే వారిలో అధికంగా,
పురుషుడి కన్నా స్త్రీ ఎక్కువగా
సంపాదించటం వలన ఇద్దరి మధ్య డబ్బు
విషయంలో, పొదుపు విషయంలో ఇద్దరి మధ్య
ఘర్షణలు జరగటం వలన కూడా విడాకుల
దారితీస్తుంది.




మంచి నడవడికతో ఇహమూ, పరమూ సాధించవలయునన్న యీ గృహస్థాశ్రమ మొక్కటియే సరియైన మార్గము.
భార్యయు, భర్తయు అనుకూలంగా నడచుకోనుత, ఉన్నంతలో తృప్తిచెందుట, దైవభక్తితో నడచుకొనుట అతిథి సత్కారములాచారించుట, మొదలగు సద్గుణములతో నడచుకొనే వాడే సరియైన గృహస్తుడనబడును. అదే భార్య భర్తల దాంపత్యజీవితము.




మీ జీవిత భాగస్వామితో మాట్లాడటం మానివేస్తే, ఇరువురి మధ్యగల సంబంధాలు చెడిపోతాయి. మీ జీవిత భాగస్వామితో బాగా మంచిగా మాట్లాడటం మరువవద్దు.



మీ జీవిత భాగస్వామి మీ ఇరువురికీ మధ్య పోట్లాట రావటానికి కారణం కావచ్చు అయితే ఆపోట్లాట ఎక్కువ కావటానికి లేదా కొనసాగటానికి మీరు కూడా కారణం. భార్యా భర్తల మధ్య సంబంధాలు చేడిపోవటానికి వారిరువురికి రాజీ పడే అలవాటు లేదా గుణం లేకపోవటం ప్రధాన కారణం.


ఘర్షణ వస్తే సర్దుబాటు ధోరణి కనబరచాలి. సానుకూల ధోరణి ఆనందకర దాంపత్య జీవితానికి అత్యంత అవసరం.

కొన్ని సందర్భాలలో పురుషుడికి గల అహం, స్త్రీ గల గర్వం, సుఖ సంసారానికి అడ్డంకిగా మారతుంది. ఇది భార్యా భర్తల మధ్య సంబంధాలకు హాని చేస్తుంది. భర్త ఆదిఖ్యం ఎక్కువ అయినప్పుడు  భార్య ఆత్మ గౌరవం దెబ్బ తింటుంది. ఇది భార్యా భర్తల మధ్య పూడ్చలేనంతటి అఘాదాన్ని సృష్టిస్తుంది.

భార్యా భర్తల మధ్య సంబంధాలు చేడిపోవటానికి వారిరువురికి రాజీ పడే అలవాటు లేదా గుణం లేకపోవటం ప్రధాన కారణం.



బరువు ఎత్తడానికి తోడు కావాలి, ఆడుకోవడానికి తోడు కావాలి, ఒంటరిగా ఉంటే తోడు కావాలి, బయటకి వెళ్ళడానికి తోడు కావాలి, ఏదైన పని చెయ్యడానికి తోడు కావాలి అంతెందుకు ఆకరికి పెరుగు చెయ్యడానికి కూడా తోడు కావాలి. ఈరోజు తోడు లేకపోతే నీకు రేపు పెరుగు ఉండదు. మనం చేసే నిత్యకార్యాలలో కూడా ఎన్నో నిజాలు దాగున్నాయి అని మనం కనుక్కోలేకపోతున్నాం. సహాయం లేకుండా ఫలితం రాదు అని పెరుగుకి కావాల్సిన తోడు చెప్తుంది. మనిషికి మనిషే తోడు, ఆ తోడే లేకుంటే లేదు నీకు మర్నాడు. రాజీ పడటం చాలా అవసరం.


ఇవి పాటించకుండా మీరు ఏ జ్యోతీష్యుడు దగ్గరకు వెళ్లినా ఏ రత్నము ధరించిన  ఉపయేగము ఉండదు. జాతకము ద్వార కొంత మేరకు వారి జీవితాలను సరి చేయవచ్చను.



















18 September 2016

శతభిషం

ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గలలొ స్నెహితులు ఉంటారు కాని వీళ్ళ వలన వారు ఉపయోగాలు ఆశించరు.





 సహోదరీ వర్గంతో, న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురౌతుంది. విద్య కొంతకాలం మందకొడిగా సాగినా క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంత కాలం కలసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమీషన్ ఏజెంటుగా, వ్యాపార వేత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్థుల వలన లాభాలు, చిక్కులు ఎదురౌతాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంత కాలం ఇబ్బందులు ఎదురౌతాయి. శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్ధిక సహాయం చెయవలసి ఉంటుంది. జూదం వలన జీవితంలో అపశృతులు ఉంటాయి.





సంతానం మంచి స్థితి సాధిస్తారు. వారి కొరకు జీవితంలో అనేక సౌఖ్యాలను త్యాగం చెస్తారు. వివాహాది శుభకార్యాలు మొండికి పడినా పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యం. ఆత్మియులతో అరమరికలు లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చెసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. బాల్యం కొంత జరిగిన తరువాత సౌఖ్యంగా జరుగుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వలన మార్పులు సంభవం. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ సాధారణ ఫలితాలు మాత్రమే.







నక్షత్ర ఫలితములు
శతభిషం. ఇది రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని. 


ఈ నక్షత్రమునందు జన్మించిన కారణమున, విూరు కొన్ని విషయములందు అదృష్టవంతులుగా ఉండకపోవచ్చును. విూరు నిజాయితీ మరియు నిష్కపటముగా ఉండువారు, ఆలోచనలందు కొంత గందరగోళమునకు గురి అగువారు, దు:ఖమును లేక నొప్పివలన బాధలు అనుభవించువారు కావచ్చును మరియు విూ పరిసరము నిస్పృహకు లోనై, ముక్కోపవంతులుగా మారవచ్చును. విూరు చేసిన తప్పుల నుండి ఎటువంటివి నేర్వక ఉందురు మరియు రాజీపడుటను మొండిగా వ్యతిరేకించు వారు కావచ్చును. విూరు విూ స్వీయ మర్గామునందు స్వతంత్రముగా ఉండువారు మరియు విూ పనులందు ఆలోచనా రహితములగా ఉందురు. 





మీరు శతభిషా నక్షత్ర నాలుగవ పాదంలలో జన్మించిన వారందరికి మీనఅంశలో ఉంటుంది. మీనరాశి అధిపతి గురువు. శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. మీ మీద గురు రాహు ప్రభావం ఉంటుంది. మీ మీద గురు రాహు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం కనుక మీకు పట్టుదల అధికంగా ఉంటుంది. మీకు ఆధ్యాత్మిక విశ్వాసం, ధార్మిక గుణం ఉంటుంది. మీరు రచయితలుగా రాణించగలరు. ఉపాధ్యాయ వృత్తి మీకు అనుకులిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు మీకు అనుకూలిస్తాయి. మీకు 4 సంవత్సరాల కాలం మాత్రమే రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభం నుండి విద్య నిరాటంకంగా సాగుతుంది. 4 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా చదువు చక్కగా సాగుతుంది. ఉన్నత విద్యాభ్యాసంలో అడ్డంకులు ఎదురౌతాయి. ప్రయత్నిస్తే వీటిని అధిగమించి విజయం సాధించా వచ్చు. 20 సంవత్సరాలలోవచ్చే 19 సంవత్సరాల శనిదశలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగుతుంది. 39 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 56 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీపర్యటనకు అవకాశం ఉంటుంది. 63 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కాలంలో తిరిగి సౌఖ్యం మొదలౌతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా సౌఖ్యంగా ఉంటుంది. 






యోగ ఫలితములు మీరు ధృతి యోగమున జన్మించినారు. ఈ యోగమున జన్మించిన కారణమున, విూరు అనేక విధముల అదృష్టవంతులుగా ఉందరు. విూరు ఔదార్యము కలవారిగా, ఉల్లాసవంతమగు దృక్పదము మరియు విశిష్టమగు వ్యక్తిత్వములతో ఉందురు. విద్యావివేకములు కలవారిగా మరియు సభలయందు నైపుణ్యముగా మాట్లాడు వ్తకృత్వము కలవారిగా ఉందురు. ఓర్పు, సహనములకు ప్రతిరూపముగా మరియు ధర్మబద్దమగు నడవడి, ఉన్నతమగు ఆశయములు మరియు దాతృత్వముల వలన పేరు ప్రఖ్యాతులు పొందగలరు. కరణ ఫలితములు విూరు బాలవ కరణమున జన్మించినారు ఇది చరవర్గమునకు చెందిన ద్వితీయ కరణము విూరు అనేక విషయములందు అదృష్టవంతులుగా ఉందురు. మంచి శారీరక దార్డ్యము , ఆకర్ణణీయ మగు ముఖము, మరియు అందము, ఆకర్షణలు కలవారిగా ఉందురు. ఇవి కాకుండా, ఇంకను, బుద్ది సూక్ష్మతకు తెలివితేటలు, వివేకము మరియు అనేక అంశములందు నైపుణ్యములు, కళలందు ఏదో ఒక అంశమున ప్రావీణ్యముకలవారిగా ఉందురు. ఆస్తి, అంతస్థులు సంకమించినవారు, మరియు అని వేళలందు, బంధుమితృల మరియు శేయోభిలాషులు చుట్టుముట్టి ఉండువారగుదురు. నక్షత్ర వివరాలు
నక్షత్రములలో ఇది 24వ నక్షత్రము. 


ఈ నక్షత్రమును శతభిషము మరియు శతభిషం అని కూడా వ్యవహరింతురు. నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి శతభిషరాహువురాక్షసస్త్రీగుర్రముఅరటిఆదివరుణుడుకుంభం
శతభిషానక్షత్రము నవాంశ
1వపాదము - కుంభరాశి .
2వ పాదము - కుంభరాశి .
3వ పాదము - కుంభరాశి.
4వ పాదము - కుంభరాశి .



శతభిష నక్షత్ర వృక్షము అరటి
శతభిష నక్షత్ర జంతువు గుర్రము
శతభిష నక్షత్ర జాతి స్త్రీ
శతభిష నక్షత్ర పక్షి కుకుటము
శతభిష నక్షత్ర అధిపతి శని.








శతభిష నక్షత్ర అధిదేవత రాహువు జ్యోతిషం
శతభిష నక్షత్ర గణము రాక్షస గణము రాక్షసరాజు రావణుడు.
నక్షత్రం శతభిష అధిదేవత భద్రకాళి మరియు అధిదేవత వరుణ దేవుడు,
వర్ణం కాఫి
రత్నం గోమేదికం
నామం గో,సా,సీ,సూ
గణం రాక్షసగణం
జంతువు గుర్రం
నాడి ఆది
ఇది రాహుగ్రహ నక్షత్రం ,
అధిదేవత వరుణ దేవుడు,
రాక్షసగణము,
జంతువు గుర్రం,
రాశ్యాధిపతి శని.





17 September 2016

మన సంస్క్రతిలో గోరింటాకు

మన సంస్క్రతిలో గోరింటాకు:-

గోరింట చెట్టు కొంతమంది ఆకుల కోసం పెంచుతారు. గోరింటాకు గోరింటాకును ముద్దగా నూరి చేతికి, పాదాలకు పెట్టుకుంటే ఎర్ర్రని రంగుతో అందంగా ఉంటాయి. ఈ పొడిలో లవంగం పొడి కలిపితే ఎరుపు, ఉసిరి పొడిని కలిపితే నలుపు రంగు తల జుట్టుకు వస్తాయి.భారతీయులు పెళ్ళి సమయంలో దీన్ని తప్పనిసరిగా వాడతారు. మెహందీ లేదా హెన్నాఅనేది "మెంధిక" అనేసంస్కృతపదంనుండిఉద్భవించింది. మెహందీ మరియు పసుపులయొక్క ఉపయోగంముల గురించి హిందూమ తవేదకర్మ పుస్తకాల్లోవర్ణించబడింది. హల్దిని(పసుపుముద్ద)అభిరంజనముగా, అలాగే మెహందీని బాహ్య ప్రతీకగా వేదాలలో చెబుతారు. వేద సిద్దాంతమూలలొ ఇది "అంతర్గతంగ కాంతి లేవడం" అనే అర్ధం వస్తుంధి. సాంప్రదాయభారతనమూనాలలో మెహందీని చేతులు మరియు కాళ్ళుగుర్చిఉద్దేశించబడింది. 







పాశ్చాత్య ప్రపంచంలో హెన్నా(గోరింట)అని పిలుస్తారు. భారతదేశం మరియు నేపాల్ దేశాలాలో మేహేందిని శరీర అలంకరణగా వాడతారు. మెహందీని సాధారణంగా వివాహనికి మరియు ఖర్వ చౌత్, ఆషాడ శుద్ద పూర్ణిమ, దీపావళి, భైదూజ్ మరియు తీజ్ వంటి పండుగలు వంటి ప్రత్యేక హిందూ మతం సందర్భాలలో సమయంలో వాడతారు. హిందూ మతం పండుగలలో చాలామంది మహిళలు హెన్నాని వారి చేతులుకు మరియు కాళ్ళుకు అలంకరించుకుంటారు. ఇది చర్మంపై సహజంగా ఉండే అలంకరణగా కనిపిస్తుంధి. హెన్నా నిజానికి ప్రధానంగా హిందూమతం వధువులకు ఒక అలంకరణరూపంగా ఉపయోగించబడింది.ముస్లింలు పండుగలు అయిన ఈద్ ఉల్ ఫితర్ మరియు ఈద్ ఉల్ అధా సమయంలో మెహందీని వాడతారు. భారత సాంప్రదాయ మెహందీని పెట్టేకళాకారు లుపరిమితసంఖ్యలో ఉండటం కారణముగా,ఆధునిక యుగంలో ప్రజలు రెడీమేడ్ హెన్నాన్ని(హెన్న ఛొనెస్) ఉపయోగిస్తున్నారు. రెడీమేడ్ హెన్నా ఆలంకరణకు సులభంగా ఉంటుంది.అయితే, భారతదేశం లో గ్రామీణ ప్రాంతాల్లో వృత్తిపరంగా దొరికే గోరింట ఆకులుని శుద్ధి చేసి,వీటికి ఆయిల్ కలిపి రాళ్ళుతొ నూరి ఆ మిశ్రమన్ని మెహందీగా వాడతారు. మెహందీని చాలా సందర్భలలో తాత్కలిక పచ్చబొట్లుగా ఉపయోగిస్తారు.దీన్నే గోరింట పచ్చబొట్టు అలంకరనగా పిలుస్తారు. నల్లని పచ్చబొట్టును ధరించడం కొసం,అనేక మంది గోరింటాకుకు కృత్రిమరంగును కలపడం ఆరంబించారు. దీని వల్ల చర్మానికి చాలా హానికరమైన మరియు శాశ్వతగాయాలు,తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. ఆలాటా అనే ఒక రకమైన గొరింటను వధువల పాదాల అలకరణకు ఉపయోగిస్తారు. ఈ సంస్క్రుతి ఇప్పటికి బెంగాల్లొ వాడుకలొ ఉన్నధి.










ఆయుర్వేదం పరంగా గోరింటాకు:-
ఔషధమూలిక గోరింటాకు... Lawsonia inermis శాస్త్రీయ వర్గీకరణ రాజ్యం: ప్లాంటే విభాగం: మాగ్నోలియోఫైటా తరగతి: మాగ్నోలియోప్సిడా క్రమం: Myrtales కుటుంబం: Lythraceae జాతి: Lawsonia ప్రజాతి: Lawsonia inermis. గోరింటాకు అంటే అదేదో ఆడవాళ్ళకు సంబంధించిన విషయం అనుకోకండి. ఆయుర్వేదం పరంగా గోరింటాకు ఒక ఔషధం. గోరింటాకును రుబ్బి గోర్లపై భాగంలో పెట్టుకోవడం వలన గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. అరిచేతిలోనూ, అరికాళ్ళలోనూ పెట్టుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ శరీరంలో ఇతర భాగాలకు సంబంధించిన నాడులు ఉంటాయి. 








ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా గోరింటాకును శరీరంలోకి ఔషధంగా తీసుకోవడం వలన అల్సర్ మొదలైన రోగాలను నయం చేయడమే కాకుండా, పేగులను శుభ్రపరుస్తుందని ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. శరీరంలో వేడి బాగా పెరిగినప్పుడు గోరింటాకును అరికాళ్ళ నిండ పట్టించుకుంటే వేడి తగ్గిపోతుంది. మార్కెట్‌లో గోరింటాకుతో చేసిన నూనె దొరుకుతుంది. శరీరానికి గాయమై రక్తం కారుతున్న సమయంలో, కాసింత గోరింటనూనెను గాయమైన భాగం మీద రాస్తే కాసేపట్లోనే విడిపోయిన చర్మం కలిసిపోయి, గాయం అతి త్వరగా మనిపోతుంది. గోర్లు, శరీరంలో వేడి కేవలం ఆడవాళ్ళకే ఉండవు, మగవారికి కూడా ఉంటాయి. తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఎవరి గోర్లైనా పుచ్చిపోతాయి. ఆరోగ్యం కోసం గోరింటాకు అందరూ పెట్టుకోవాలి. గోరింటాకు ఆడవాళ్ళకే అని ఎక్కడ చెప్పలేదు. వ్రతం, పూజలు, వివాహాల సమయంలో, పెద్ద పెద్ద క్రతువులు చేసే సమయంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు. ఇక్కడ గోరింటాకు అంటే బయట దుకాణాల్లో మెహంది లేక గోరింటాకు పోడి కాదు. గోరింటకు చెట్టు నుంచి కోసి రుబ్బిన ఆకుకే ఔషధ గుణాలు ఉంటాయి.










మన సాంప్రాదాయాలు:-
గోరింటాకు పెట్టుకోవడం శుభసూచకం. పడతుల్లో మరెన్నో నమ్మకాలు ఉన్నాయి. పాదాలకు పారాణిగా, అరచేతులకు అలంకరణగాను గోరింటాకు సుపరిచితమే. తక్కువ స్థలంలోనే గుబురుగా పెరిగే మొక్క గోరింట. మగువ మనసుకు ముచ్చట కలిగించేది గోరింట. అతివల చేతుల్లో మందారంలా పూసి, అందరిని మురిసిపోయేలా చేస్తుంది. ఆకులను మెత్తగా రుబ్బి, ఆ పేస్ట్‌ని కావలసిన ఆకారంలో చేతులకు, పాదాలకు అలంకరించుకుని గంటపాటూ ఉంచితే ఎరుపు రంగులోకి మారుతుంది. గోరింట అలంకరణకు, అందం రెట్టింపు చేయడానికే కాకుండా ఆరోగ్యానికి సైతం ఉపయోగపడుతుందని ఆయుర్వేద, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలున్న కారణంగా నెలకొక్కసారి అయినా పెట్టుకోవాలని వీరు సూచిస్తున్నారు. గోరింటాకు పెట్టుకోవడంవల్ల గోళ్ళలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా పలు అలెర్జీలను దూరం చేయవచ్చు. ఏ కారణం చేతనైనా చర్మంపై ఏర్పడిన మచ్చలను పోగొట్టడానికి గోరింటాకు బాగా నూరి పూస్తే సరిపోతుంది. వేడిగడ్డలను సైతం గోరింటాకు నయం చేస్తుంది. ఇది గోరుచుట్టు, కాళ్ల పగుళ్లకు సహజ సిద్ధమైన నివారిణి అని చెప్పవచ్చు. గోరింటాకు పేస్టుతో తలకు ప్యాక్ వేసుకుంటే జుత్తు ఆరోగ్యకరంగా కాంతులీనుతుంది. జుత్తు రాలడం, చుండ్రు లాంటి సమస్యలను సమూలంగా నివారిస్తుంది. గోరింటాకు యాంటి బయాటిక్ లక్షణాలు కలిగి ఉండడం చేత క్రిములను దరిచేరనీయకుండా చూస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నచోట గోరింటాకు పేస్టును రాసి కాసేపు ఉంచితే ఫలితం కనబడుతుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది. గోరింట బెరడుతో కాచిన కషాయం రక్తవిరోచనాలను ఇట్టే నివారిస్తుంది. గోరింట పువ్వులను నూరి వెనిగర్‌తో కలిపి తలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది. పైగా సుఖనిద్రకు ఉపకరిస్తుంది. పలు చర్మ సమస్యలను గోరింటాకు ముద్ద పనిచేస్తుంది. ఆవనూనెలో గోరింటాకులు వేసి కాచి అది తలకు రాసుకుంటే వెంట్రుకలు పెరగడమే కాక మృదువుగా మారుతాయి. విత్తనాలు దుర్వాసన తొలగించే డియోడరెంట్‌గా వాడుతారు. పువ్వులలో నుంచి తీసిన నూనెలు పర్‌ఫ్యూమ్స్‌గా వినియోగిస్తారు. చెట్టు బెరడు పచ్చకామెర్లను, కాలేయం వాపు తీవ్రతనుతగ్గిస్తాయి. స్ర్తిలకు సంబంధించిన పలు సమస్యలకు గోరింటాకు, పూలు, కాయలు, బెరడు.. అన్ని ఉపయోగకరమే. పండగలు, పర్వదినాలలో గోరింట ప్రధాన భూమిక పోషిస్తుంది.










మన ఆచారాలు:-
ఆషాఢ మాసం మనసులో మెదిలిందంటేనే గుర్తుకొచ్చేది గోరింటాకు. ఆడవాళ్ల చేతులు ఎర్రగా, అందంగా పండిపోతూ దర్శనమిస్తాయి ఈ నెల్లాళ్లు. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ మగాళ్లను సైతం ఇంట్లో పెద్దలు పోరుతూ ఉంటారు. కారణమేమంటే జ్యేష్ఠ మాసంలో మొదలైన వర్షాల ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. దీంతో కాళ్లు చేతులు రోజూ తడిచే ప్రమాదం ఉంది. దీంతో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం జరిగుతుంటాయి. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మన పద్దతులు:- ఔషధీయుక్త సౌందర్య సాధనమైన గోరింటాకు స్త్రీలకు ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు.గోరింటాకుని మగ వాళ్ళు కూడా వాడుతారు. దీని రంగు శాశ్వతంగా ఉంటుంది. శరీరంలో ఉన్న అధిక మైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. గోరింటాకుని చక్కగా ముద్దగా రుబ్బి,అరచేతుల్లోనూ, అరికాళ్లలోనూ పెట్టుకుంటే శరీరంలోని వేడినంతా లాగేసి, అవి ఎర్రబడతాయి. దాన్నే పండట మంటారు. శరీర తత్త్వాన్ననుసరించి లేత నారింజ రంగు నుండి ముదురు ఎరుపు రంగు వరకు పండుతుంది. ఈ రంగు ప్రేమ గాఢతని తీవ్రతని తెలియ చేస్తుందంటారు.











మన సౌందర్య పోషణ:-
తడిలో,నీళ్ళల్లో పని చేసే ఆడవారికి కాలి వేళ్ళ సందున పాయటం, మడమలు పగలటం సహజం. వానాకాలమైతే మరీనూ. గోరింటాకు పెట్టుకుంటే ఆ బాధలకి ఉపశమనం లభిస్తుంది. అందుకే తప్పనిసరిగా ఆషాఢ మాసంలోను,అట్ల తద్దికి, ఉండ్రాళ్ళ తద్దికి ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలని నియమం ఏర్పరచారు మన పెద్దలు. ఇది సంప్రదాయం పేరుతో ఏర్పాటుచేసిన వ్యాధి నివారణ కార్యక్రమం. ఆ విధంగా చెప్పకపోతే ఆడవాళ్ళు తమ గురించి తాము పట్టించుకుంటారా? గోరింటాకులో ఉన్న ఔషధీ గుణం పిప్పిగోళ్ళని గోరుచుట్టుని రాకుండా నివారిస్తుంది. ఒక వేళ వస్తే తగ్గిస్తుంది. కాలి వేళ్ళ గోళ్ళ మొదళ్ళలో మట్టి చేరి ఒండ్రు పోస్తే ఆ వేలికి గోరింటాకు పెడతారు. పోతుంది. వెనకటి రోజుల్లో పాద సౌందర్య పోషణ [పెడిక్యూర్], హస్త సౌందర్య పోషణ [మెనిక్యూర్] అని సౌందర్య శాలల వెంట తిరగటానికి తీరిక, ఓపిక, ఆర్థిక స్తోమతు లేకపోయినా, అన్నీ పనులు తామే చేసుకున్నా వారి చేతులు మృదువుగానే ఉండటానికి ఈ సహజమైన, ప్రకృతి సిద్ధమైన సామాగ్రిని ఉపయోగించటమే కారణం అని ఎంతో మంది అంగీకరించిన మాట. పనిలో పనిగా గోళ్ళని పగడాల్లాగా మెరిసేట్టు చేస్తుంది. గోళ్ళ రంగుల కోసం వందలు వేలు వెచ్చించాల్సిన పని లేదు. ఎటువంటి దుష్ప్రభావాలూ [సైడ్ ఎఫెక్ట్స్] ఉండవు. పిల్లలు తెల్లగా పుట్టాలని గోరింటాకుని తింటారు కొన్నిసంప్రదాయాలవారు. గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు. ఒకసారి జుట్టుకి గోరింటాకు రంగు పడితే ఒక పట్టాన పోదు. తగ్గదు కూడా! అంతే కాదు. అది సహజమైన మంచి కండిషనర్ గా పని చేస్తుంది. గోరింటాకు పెడితే జుట్టు మెత్తగా పట్టు కుచ్చు లాగా ఉండి, నిగనిగా మెరుస్తుంది. కేశ పోషణ కోసం మెంతి, ఉసిరి వంటివి ఉపయోగించాలంటే కూడా గోరింటాకు బేస్ లాగా పనిచేస్తుంది. ఇది ఆడవారికి మాత్రమే పరిమితం కాదు సుమా! ఈ రోజుల్లో ఆడ, మగ తేడా లేకుండా అందరూ జుట్టుకి గోరింటాకు పెట్టుకుంటున్నారు.









గోరింటాకు పెళ్లి వేడుకల్లో:-
వివాహానికి ముందు మెహిందీ కోసం ప్రత్యేకంగా వేడుకలు జరుపుకుంటాం.
గోరింటాకు ముద్దని తయారు చేయటమే ఒక కళ. ఆకుతో పాటు మరెన్నింటినో చేర్చుతారు ఆయా సందర్భాల కనుగుణంగా బాగా పండుతాయని. ఇప్పుడు గోరింటాకు ముద్దని తయారుచేసే పని లేదు. సిద్ధంగా అన్నీ చోట్లా లభిస్తోంది. గోరింటాకు పెట్టటం ఒకకళగా పరిగణించబడుతోంది. అరచేతులకే కాక చేతుల వెనుక భాగాలు, ముంజేతుల నుండి మోచేతుల వరకు కూడా రకరకాల జిలుగులతో గోరింటాకుని అలంకరించుకుంటున్నారు. ఇంకా, మెడ, భుజాలు కూడా ‘మెహింది’ పెట్టించు కోవటం ఒక ‘ఫాషన్’ అయింది. పెళ్ళిళ్ళకి ప్రత్యేకంగ మెహెంది పెట్టేవారిని నియమించుకుంటున్నారు. ఉత్తర దేశం వారి పెళ్లి వేడుకల్లో మెహెందికి ఒక రోజు కేటాయిస్తారు. పెళ్లి కూతురి చేతులకి గోరింటాకు పెట్టటం ఒక గౌరవంగా పరిగణించ బడుతుంది. ఇప్పుడు ప్రతి శుభ కార్యంలోను గోరింటాకు పెట్టటం ఒక ఆనవాయితీగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే పసుపు తర్వాత అంతగా ఆడవారి జీవితంతో పెనవేసుకు పోయింది గోరింటాకు.








మన పెద్దల నమ్మకాలు:-

 గొరింటాకు , స్త్రీలకు ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి . పెళ్ళికాని అమ్మాయిలకు గోరింట ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని అంటారు.పెళ్ళైన వారు పెట్టుకొంటే .. బాగా పండితే .. తమ భర్త పై ఉన్న ప్రేమ గాఢతని తెలియ చేస్తుందంటారు.ఎర్రగా పండకపోతే కొందరు బాధపడిపోతూ వుంటారు , ఎవరి శరీర తత్వాన్ని బట్టి అలా పండుతుంది .గోరింటాకు పండితే రెండు రకాలయిన రంగులలో (ముదురు ఎరుపు మరియు లేత నారింజ ) వుంటుంది. గోరింటాకు ఒక సౌంధర్య సాదన కోసమే కాదు , ఇది ఒక అద్బుత ఔషధం కూడా .కేవలం ఆడవాళ్లకే కాదు , మగవారు కూడా దీనిని ఉపయోగించేవారు.ఎర్రగా పండడమంటే …శరీరం లోని వేడిని లాగేసి బయటకు వచ్చే క్రమంలో ఇది ఎర్రగా మారుతుంది.దానినే మనం బాగా పండింది అంటాము . కొన్ని హిందూ సాంప్రదాయ పండుగలలో ( అట్లతద్దె,ఉండ్రాళ్ళ తద్దె ) , గోరింటాకు ను తప్పని సరిగా పెట్టుకోవాలంటారు. దీనిలో ఉన్న ముఖ్య ఉద్దేశ్యం , పండుగలప్పుడు సౌందర్యం గా చేతులను , కాళ్ళను అలంకరించడం కోసమని కాదు ,పండుగ సమయాల్లో స్త్రీలు ఎక్కువగా తడి నీళ్ళలో తిరుగుతూ పనిచేస్తూ వుంటారు , దానివలన కాలి మడిమెలు వాయడం,మడిమెలు పగలడం జరుగుతుంటాయి,దాని వలన ఎంతో బాధగా వుంటుంది … గోరింటాకు ఇలాంటి భాదలనుంది ఉపశమనం కలిగిస్తుంది. గోరింటాకులో ఉన్న మరో అద్బుత గుణం గోరుచుట్టుని రాకుండా చేస్తుంది.శరీరం పైన వచ్చే పుండ్లు వంటి వాటిపైన గోరింటాకు పెడితే త్వరగా ఉపసమనం కలిగి , అవి తగ్గిపోయేలా చేస్తాయి.పూర్వకాలం లో కొన్నిసంప్రదాయాలవారు,పుట్టే పిల్లలు తెల్లగా పుట్టాలని గోరింటాకుని తినేవారట . గోరింటాకు కేవలం చేతులకు , కాళ్ళకు కాదు , జుట్టుకి కి కూడా ఎర్రదం వచ్చేలా చేస్తుంది. జుట్టుకోసం కండిషనర్ ఉపయోగిస్తుంటాం.గోరింటాకు కంటే కండిషనర్ ఉంటుందా చెప్పండి, గోరింటాకు పెడితే జుట్టు మృదువుగా ఉండేలా చేసి , జుట్టుకు సహజ మయిన ఎరుపు రంగులో మార్చి మరింత అందం గా చేస్తుంది.









గోరింటాకు మరకలు:-
సాధారణంగా మహిళలు రాత్రిపూట అరచేతులకు గోరింటాకు పెట్టుకుంటుంటారు. ఇలా పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో బట్టలకు, బెడ్‌షీట్లకు గోరింటాకు మరకలు పడుతుంటాయి. వీటిని తొలగించేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ఇలా పడిన గోరింటాకు మరకలు పోవడానికి మరకంటిన ప్రదేశాన్ని అరగంటసేపు పాలలో నానెయ్యాలి. తర్వాత శుభ్రం చేస్తే అదే పోతుంది. పాలతో వీలుపడని పక్షంలో నిమ్మకాయ ముక్కతో రుద్దిచూస్తే గోరింటాకు మరకలు పోతాయి. అలాగే, జేబు రుమాళ్ళపైన, టవల్స్‌ మీద పడే లిప్‌స్టిక్‌ మరకలు పోవాలంటే వాటిపై గ్లిసరిన్‌ రాసి కొంతసేపు తర్వాత సబ్బుతో ఉతకితే మంచి ఫలితం ఉంటుంది. శీకాయపొడితో రుద్దితే జరీమీద పడిన మరకలు పోతాయి. దుస్తుల మీద పడిన టీ మరకలు పోవాలంటే ఓ టమాటా ముక్కను మరక మీద రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మరకపోతుంది. విద్యార్థుల దుస్తులపై పడిన సిరా మరకలు పోవాలంటే పుల్లటి పెరుగులో కాసేపు నానబెట్టి తర్వాత ఉతికితే సిరా మరక కనిపించదు. మన సంస్క్రతి. మన సాంప్రాదాయాలు. మన ఆచారాలు. మన పద్దతులు. మన ధర్మాలు. విలువలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది .










16 September 2016

భరణి నక్షత్రము 1234 మేషరాశి

భరణి నక్షత్రము
మేషరాశి లో భరణినక్షత్రము

నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి భరణి శుక్రుడు మానవ స్త్రీ దేవదారు ఏనుగు మధ్య కాకి యముడు మేషం

నక్షత్రములలో ఇది రెండవది.
భరణి నక్షత్రము నవాంశ
1 వ పాదము - మేషం .
2 వ పాదము - మేషం .
3 వ పాదము - మేషం .
4 వ పాదము - మేషం .

భరణినక్షత్రము గుణగణాలు భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడూ కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటి వారిని ఎంత గొపాగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించ లేరు. వృద్ధాపయములో సుఖజీవనము చేయడనికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంఘములో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతము అయిన సామానుల అందు ఆసక్తి ప్రదర్శిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము. కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. విరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు.ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధరణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది.

భరణి రవి ఆకాశనీలం వజ్రం లీ,లూ,లే,లో మానవగణం ఏనుగు మధ్య .

భరణి నక్షత్ర వృక్షము దేవదారు

భరణీ నక్షత్ర జంతువు ఏనుగు

భరణీ నక్షత్ర జాతి స్త్రీ

భరణి నక్షత్ర పక్షి కాకి.

భరణి నక్షత్ర అధిపతి శుక్రుడు.

భరణి నక్షత్ర అధిదేవత యముడు.

నక్షత్రం భరణి అధిదేవత రవి

వర్ణం ఆకాశనీలం

రత్నం వజ్రం

నామం లీ,లూ,లే,లో

నాడిమధ్య.

గణం మానవగణం జాతి పురుష పక్షి కాకి జంతువు ఏనుగు నాడి మధ్య. భరణి రవి ఆకాశనీలం వజ్రం లీ,లూ,లే,లో మానవగణం ఏనుగు నాడిమధ్య.

ఆరుద్ర నక్షత్రము1234 మిధునరాశి

ఆరుద్ర నక్షత్రము

ఆరుద్ర నక్షత్రములలో ఆరవ నక్షత్రం. ఇది పరమశివుని జన్మ నక్షత్రం.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి ఆరుద్ర రాహువు మానవ స్త్రీ శునకము రేల ఆదినాడి. పింగళ రుద్రుడు మిధునము.

ఆరుద్ర నక్షత్రము నవాంశ
1 వ పాదము -మిధునరాశి.
2 వ పాదము - మిధునరాశి .
3 వ పాదము - మిధునరాశి .
4 వ పాదము - మిధునరాశి .

ఆరుద్ర నక్షత్రమునందు ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేఱ్పరితనమును, మించిన జ్ఞాపక శక్తియు కలిఁగియుండెదరు, గొప్ప గమ్మత్తుఁగా మాట్లాడఁగలరు. వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బులకు చెందునట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనెడి కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు దారి తీయ వచ్చును. తొందఱపాటుతో ముందు-వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంతనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొన లేరు. లౌక్యము తెలివితేఁటలు కనబఱఁచుతారు. తల్లిఁదండ్రులు, తోడఁబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిఁగియుంటారు. రాత్రి పూఁట నిర్ణయాలు తీసుకుంటారు. మొదట తనలోతాను అందఱిలో తక్కువ అని పదేపదే అనుకొనవలసి వచ్చిన కూడను ఆ తరువాత అధిక్యతా భావములోకి మారి పోతారు. నిండు నూఱేండ్లు బ్రతికెదరు సంపూర్ణ ఆయుర్ధాయము కలిగి ఉంటారు. ఆడవారిపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనఁగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మఱల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం – గుణగణాలు, ఫలితాలుఆరుద్ర నక్షత్రాన్ని పరమేశ్వరుని జన్మ నక్షత్రంగా ప్రతీతి. ఆధిపత్య దేవుడు పరమేశ్వరుడు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. గోమేధికం రాయి పెట్టుకోదగినది. వీరు వస మొక్కలు పెంచుకోవాలి. దర్భ సమిధలతో హోమం చేస్తే మంచిది.ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మిథున రాశిలోనే ఉంటాయి.

ఆరుద్ర మొదటి పాదము
ఆరుద్ర మొదటి పాదములో జన్మించిన వారు అదృష్టంపైనే నమ్మకం పెట్టుకుంటారు. అదృష్టంతోనే నెగ్గుకు రావాలనే మనస్తత్వం. వస్తు, విషయ జాగ్రత్తలు ఎక్కువ. ఈ విషయంలో ఒక్కోసారి శృతిమించుతుంటాయి కూడా. దీని వల్ల ఇబ్బందులు తప్పవు. పారదర్శక వైఖరితో కలుపుకునే స్వభావం ఉంటుంది. లోకాన్ని పరిశీలించే స్వభావం ఉండటంతో అవకాశాలపై పట్టు నిలుపుకుంటారు. సంస్కృతి, సాంప్రదాయలపై, ఆచార వ్యవహారాలపై ఆసక్తి, శ్రద్ధ ఉంటుంది.ఆరుద్ర మొదటి పాదములో గ్రహ దశలు ఈ పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 18 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.

ఆరుద్ర రెండో పాదము
ఆరుద్ర రెండో పాదములో జన్మించిన వారిలో పట్టుదల, తీక్షణత ఎక్కువగా ఉంటాయి. అంతిమ లక్ష్యం మీద దృష్టి పెడతారు. ఆలోచనల్లో భిన్నత్వాన్ని గుర్తించలేరు. దీంతో కోరి కష్టాలు తెచ్చుకుంటారు. పలు విషయాలందు ఆసక్తి ఎక్కువ. ఒక్కోసారి చేతులు కాల్చుకుంటారు. సమస్యలను గుర్తించటంలో ఇబ్బంది ఉంటుంది. మధ్యలో ఏర్పడే పరిణామాలతో కొంచెం గందరగోళానికి గురవుతారు.ఆరుద్ర రెండో పాదములో గ్రహ దశలు రెండో పాదములో జన్మించినవారికి రాహు మహర్దశ 13 సంవత్సరాల ఆరు నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.

ఆరుద్ర మూడో పాదము
ఆరుద్ర మూడో పాదములో తరచూ సమస్యలు ఎదుర్కొంటారు. చురుకుదనం వల్ల ఒక్కోసారి హద్దు మీరుతుంది. దీంతో సమస్యలు ఎదుర్కొనక తప్పదు. వేగంతో ముందుకెళ్లబోయి తల బొప్పి కట్టించుకుంటారు. వాయుతత్వ స్వభావం ఉండటంతో నిర్ణయాల్లో నిలకడ లోపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. సర్దుకొనే స్వభావం ఉండటం కలిసి వచ్చే లక్షణం. కానీ సమస్యను నిజాయితీగా అర్థం చేసుకుంటేనే ఫలితముంటుంది.

ఆరుద్ర మూడో పాదములో గ్రహ దశలు మూడో పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 9సంవత్సరాలు, తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.

ఆరుద్ర నాలుగో పాదము
ఆరుద్ర నాలుగో పాదమున జన్మించిన వారు నిదానంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా లౌక్యం, చాకచక్యం మిగిలిన లక్షణాలను ప్రభావితం చేస్తాయి. దూరదృష్టితో వ్యవహరించాలి. నిలకడ సాధించడం కూడా ముఖ్యమే. నిదానమే ప్రధానం అన్న సూక్తి వర్తిస్తుంది. అందరిని కలుపుకుపోయే స్వభావం ఉంటుంది. దీంతోపాటు ఫలితాన్ని పంచుకొనే వైఖరికూడా అవసరం. అనవసరపు కోపానికి సంకెళ్లు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా గెలిచి రావాలన్న వ్యూహాన్ని సమర్థంగా అమల్లో పెట్టాల్సి ఉంటుంది.ఆరుద్ర నాలుగో పాదములో గ్రహ దశలు నాలుగో పాదములో జన్మించిన వారికి ముందుగా రాహు మహర్దశ 4 సంవత్సరాల 6 నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.

ఆరుద్ర నక్షత్రము – గుణగణాలుఈ నక్షత్రములో జన్మించిన వారిది అనుకొన్న దానిని సాధించేదాకా నిద్రపోని తత్వం. మాటల్లో నేర్పరితనమును, మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. పట్టుదల కూడా ఉంటుంది. కార్యసాధనలో ఎన్నిసార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బుల విషయంలో నిర్ణయాలు సరిగా ఉండవు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనే కోరిక, మొండి పట్టుదల జీవితంలో ఒడిదుదుకులకు దారి తీయవచ్చును. తొందరపాటుతో ముందు వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొనలేరు.ఆయుస్సు కూడా ఎక్కువే. ఆడవారిపట్ల గౌరవ భావం కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుంచి 26 సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.ఈ నక్షత్రము వారు ఆలోచనలు, నిర్ణయాలు చకచకా మార్చేసుకుంటారు. క్రయ విక్రయాలయందు ఆసక్తి ఉంటుంది. దీంతో వ్యాపారమందు దూసుకెళ్లే స్వభావం కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించకపోతే వీరితో పాటు వెంట ఉన్నవారికికూడా ఇబ్బంది తప్పదు.

నక్షత్రం ఆరుద్ర

అధిదేవత కాళి

వర్ణం ఎరుపు

రత్నం గోమేధికం

నామం కూ,ఘ,బ,చ

గణం మానవగణం

జాతి పురుష

పక్షి కాకి.

జంతువు కుక్క .

కాళి ఎరుపు గోమేధికం కూ,ఘ,బ,చ మానవగణం కుక్క ఆది ఆరుద్ర నక్షత్రపు చెట్టు రేల ఆరుద్ర నక్షత్రపు జంతువు కుక్క. ఆరుద్ర నక్షత్రపు జాతి - ఆడ ఆరుద్ర నక్షత్ర పక్షి కాకి. ఆరుద్ర నక్షత్ర అధిపతి రాహువు. ఆరుద్ర నక్షత్ర అధిదేవత రుద్రుడు ఆరుద్ర నక్షత్ర గణము మానవగణము