13 February 2016

అనంత పద్మనాభస్వామి ఆలయం

మైండ్ బ్లోయింగ్’ నిజాలు! అనంత పద్మనాభస్వామి ఆలయ ఆరవ నేల మాళిగ ద్వారం ఎందుకు తెరవలేకపోతున్నారు ..?
కేరళ లోని తిరువనంత పురం లో గల అనంత పద్మనాభ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.అద్భుతమైన శిల్ప సంపదకు, అచ్చెరువొందించే స్వామివారి జగన్మోహన రూపానికి సమ్మోహితులై భక్తులు ఆలయ దర్శనానికి తండోప తండాలుగా వచ్చేవారు. అకస్మాత్తుగా అక్కడి నేలమాళిగల్లో బయట పడ్డ అనంత సంపదకు ప్రపంచమంతా నిశ్చేష్టమైంది. ఎన్నో రోజులు వార్తల్లో అదే ముఖ్యాంశమై నిలిచింది. ఆలయ నేలమాళిగల్లో బయటపడ్డ బంగారు ఆభరణాలు,వస్తువులు, పాత్రలు, 500 కిలోల బరువుండే ఏనుగులు,వింత వస్తువులు అందరినీ అబ్బురపరిచాయి. ఆలయ చివరి నేలమాళిగ ద్వారాన్ని మాత్రం తెరవడం ఎవరి వల్లా సాధ్యం కాలేదు. వాటిని తెరిచే ప్రయత్నం చేసిన అధికారులు మరణించడం, ఆ ద్వారం తెరవలేక పోవడం జరుగుతోంది.చివరికి సుప్రీం కోర్టు ఆ ద్వారం తెరవకూడదనే ఆదేశాలనిచ్చింది. ఇప్పటికీ ఆ ఆరవ నేలమాళిగ ద్వారం రహస్యాన్ని ఎవరూ ఛేదించలేక పోయారు.

ఆరవ నేలమాళిగ ద్వారం ఉత్కృష్టమైన నాగ పాశం తో సిద్ధ సాధువులు మంత్రోక్తంగా బంధించినట్లు తెలుస్తోంది. ఆ ద్వారానికి ఎటువంటి చిలుకు కానీ మేకులు కానీ లేవు. అది 16 వ శతాబ్దం లో మార్తాండవర్మ నిర్మింపజేసిన కట్టడం. ఎంతో మంది వేద పండితులు, తాంత్రికులు నాగ పాశాన్ని నిలువరించే గరుడ మంత్రాన్ని పఠించి ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. మానవ మాత్రుల శక్తికందని ఏదో యోగ శక్తి ఆ సంపదను ఇప్పటికీ కాపాడుతోంది.

వేదాలు, ఇతిహాసాల కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాలతో సర్పాలకు విడదీయరాని బ ంధం ఉంది. కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలందుకుంటే, మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విషనాగుగా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతుంది. అందుకే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధం ఉన్న ఆరో నేలమాళిగను తెరిచేందుకు పండితులు అంగీకరించట్లేదనే విషయం తెలిసిందే. నాగజాతి విశేషాల సమాహారం ఇది.”అనల తేజులు దీర్ఘ దేహులు నైన యట్టి తనూజులన్ వినుత సత్త్వుల గోరె గద్రువ వేపురం వేడ్కతో…” కశ్యపునికి ఇద్దరు భార్యలు. కద్రువ, వినత. ఇది కృతయుంగంలోని విషయం. పుత్ర కామేష్ఠ యాగానంతరం వారి వారి కోరికల ప్రకారం కద్రువకు ఐదు వందల ఏళ్ల పాటు నేతి కుండలలో భధ్రపరచగా కద్రువ గుడ్ల నుంచి శేషుడు, వాసుకి, ఐరావతం, తక్షక, కర్కోటక, ధనంజయ, కాళియ ఇత్యాది నాగుల వెలువడ్డారు. తల్లి తొందర పాటు వల్ల వినత అండాల నుంచి సగం దేహంతో అనూరుడు, ఆ తరువాత మరో ఐదు వందల ఏళ్లకు గరుడుడు జన్మించారని భారతంలోని అది పర్వం ద్వితియాశ్వాసంలో పేర్కొన్నారు.హారంగా, పడకగా…ఆది శేషుడు భూభారాన్ని వహించగా, వాసుకి పాల సముద్ర మధనంలో తరిత్రాడుగా ఉపయోగపడ్డాడు. తక్షకుని విషం, చోరత్వం, పరీక్షిత్తు మరణానికి, జనమేజయుడు నిర్వహించిన సర్ప యాగానికి హేతువులైనాయి. కాళీయ మర్దనం కృష్ణావతారంలో ముఖ్య ఘట్టం. శివుని కంఠంలో హారంగా, విష్ణువు పడకగా సర్పాలు వారికి అత్యంత సన్నిహితులైనాయి.తండ్రి ఒక్కరే అయినా తల్లుల మధ్య గల వైషమ్యం, పిల్లల మధ్య విరోధానికి ఎలా దారి తీస్తుందో నాగులు, గరుత్మంతుడి వృత్తాంతం ద్వారా మనకు అవగతమవుతుంది. తన ఆజ్ఞను మీరినందుకు ఆదాం, ఈవ్‌లను దేవుడు ఈడెను తోట నుంచి బహిస్కరించి వారిని అందుకు పురికొల్పిన సాతాను సర్పాన్ని… నీవు నీ పొట్టపై పాకుతూ, మట్టి తింటూ నీ జీవితం గడుపు. ఈ స్త్రీ, ఆమె కుమారులు నీకు శత్రువులగుదురు గాక! నీవు వారి కాలిపై కాటు వేస్తావు, వారు నీ తలపై గాయపరుస్తారు అని ఆజ్ఞాపించారు.సర్పం-సప్త ప్రతీకలుప్రాచీన కాలం నుంచి సర్పం (సర్పెంట్) సప్త విషయాలకు ప్రతీకగా ఉంది.1.దేవునిగా- తన తోకను తానే మింగుతుంది కాబట్టి. అంతేగాక అనేక తెగలలో సర్పం సృష్టిలో ప్రముఖ పాత్ర వహించిందని నమ్మేవారు.2.తన తోకను తానే మింగుతూ వృత్తాకారంలో ఉన్న సర్పాన్ని అనంతానికి చిహ్నంగా ప్రాచీనులు భావించారు. నవీన శాస్త్రజ్ఞుడు ‘కెకూలే’ ఈ చిహ్నాన్ని కల గని ‘బెంజిన్’ అణు నిర్మాణాన్ని ఊహించాడని, అదే రసాయన శాస్త్రంలో మరో ముందడగు అయిందని చెబుతారు.3.పునరుజ్జీవనానికి, పునర్ యవ్వనానికి, కుబుసాన్ని విడిచి తిరిగి శక్తిని పొందడం ద్వారా ఎస్కులేపియస్ దేవునికి ప్రీతిపాత్రమై, సర్పం వైద్యరంగానికి చిహ్నమైంది.4.గ్రీకులకు, రోమన్లకు సంరక్షక దేవత. హోమగుండాల వద్ద చిహ్నంగా ఉంది. కౌరవుల యుద్ధ పతాకం సర్పం.5.జ్ఞానానికి6.సైతానుకు కూడా సర్పాలే గుర్తు.తొలి మానవుల పతనంఈజిప్షియన్లకు, హిబ్రూలకు, కాననైట్లకు, మధ్యధరా ప్రాంతం వారికి, ఉగ్రాయిట్లు, సుమేరియన్లకు సర్పాలు సరప్ (మంట పుట్టించేవి), నాహాస్, పెటెన్, బెటెన్, నాగులుగా సుపరిచితమే. గిల్గామేష్ కథలో నానా కష్టాలు పడి గిల్గామేష్ సాధించుకు వచ్చిన మృత సంజీవనీ లతను సర్పం అపహరించుకొని పోయి మానవులకు మృత్యువు తప్పని సరి చేస్తుంది. ఉదంకుని దగ్గరి కుండలాలపహరించుకొని పోయి తక్షకుడు సర్పయాగంలో తన వంశ వినాశనానికి కారణ భూతుడవుతాడు.జ్ఞాన ఫలాన్ని ఈవ్, ఆదాం తొలి మానవ దంపతులు తినేలా చేసి సాతాన్ సర్పం తొలి మానవుల పతనానికి కారణమయ్యాడు. ఈజిప్షియన్లకు నాగ దేవతలున్నారు. యురియస్ సర్పం రక్షణకు, ఎపెప్ కీడుకు, ఎనెప్ సంతానానికి దేవతలు. గ్రీకులకు డ్రాగన్ అంటే మహాసర్పం. ప్రాచీన గాథల్లో డ్రాగన్‌లు ఎక్కువ. నాగుల చవితి మనకు అత్యంత ప్రియమైన పండగ. ఓహియో దేశంలో ప్రసిద్ధి కెక్కిన మహా సర్పపు దిబ్బ అమెరికన్ ఇండియన్లకు పవిత్రమైనది. దీని పొడవు అరకిలోమీటరు.

మహారాజయోగంజూపిటర్ దేవత సర్ప రూపంలో ఒలింపియాకు ప్రత్యక్షమైనాడని అందుకే అతని ఆశీస్సులతో అలెగ్జాండర్ జనించాడని ఓ ఐతిహ్యం. మార్క్ ఏంటోని క్లియోపాత్రను ముద్దుగా ‘ద సర్పెంట్ ఆఫ్ ఓ ల్డ్ నైల్’ నైలు నదీ సర్పంగా పిలిచేవారట. క్లియో పాత్ర మరణించేప్పుడు ‘ఏస్ప్’ సర్పాలను పెదాలకు, హృదయంపై కాటు వేయించు కొని నిశ్శబ్దంగా నిష్క్రమించడం మనకు తెలుసు. మొదలయిన పదం తిరిగి వాక్యం చివర వచ్చే కవిత్వ పంక్తులను సర్పెంటైన్ వర్సెస్ అంటారు. సర్ప బంధ కవిత్వం మనకు తెలుసు.సర్పజాతులుఆస్ట్రేలియన్ల ఆదిమ తెగలు ఇంద్రధనుస్సు సర్పం భూమికి పర్వతాలతో, నదులతో నిర్మించిందని నమ్ముతారు. సర్పం కలలోకి రావడం శృంగారానికి, కామేచ్ఛకి చిహ్నంగా ఫ్రాయిడ్ లాంటి మానసిక శాస్త్రజ్ఞులు చెప్పారు. సంవత్సరానికి లక్షమందిని మృతుల్ని చేసే విష జాతి సర్పాలు 600 ఉంటే, మొత్తం 3,000 రకాల పాముల ఉన్నాయని ఒక అంచనా అర్జునుడు నాగకన్య ఉలూచిని పెళ్లాడాడు. కంబోడియాలోని అంగ్‌కోర్ రాజ వంశీకులు తాము బ్రహ్మణ రాజకుమారుడు నాగుల యువరాణిల సంతానమని విశ్వసిస్తారు. హితుడిగాను, శత్రువుగాను సర్పం ప్రసిద్ధమే.
అందుకే భగవానుడిలా వాక్రుచ్చినాడు.”సర్పాణా మస్మి వాసుకిః అనంత శ్చాస్మి నాగానాం!

కేరళలో ఇప్పటికీ తాంత్రిక విద్యలు తెలిసిన వారు కొంత మంది ఉన్నారు. వీరిలో కొందరి తాతలు, తండ్రులు రాజాస్థానంలో వివిధ ఉద్యోగాలు చేసినవారే. తమ తండ్రులకు, తాతలకు నాగబంధనం చేయడం ఎలాగో తెలుసని చాలా స్పష్టంగా చెబుతున్నారు. వారు చెబుతున్న అంశాలను క్రోడీకరిస్తే, కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి.

1.నాగబంధం అన్నది మొత్తం నిధినిక్షేపాలకు వర్తిస్తుంది.

2.కేవలం నాగబంధం వేసిన గదికి మాత్రమే నాగుల రక్ష ఉన్నదని అనుకోవడానికి వీల్లేదు.

3.నేలమాళిగలోని ఐదు గదులను తెరిచి అందులోని సంపదను గుర్తించినప్పుడే నాగబంధం తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది.

4.సంపద వెలుగుచూస్తున్న సమయంలోనే కమిటీ సభ్యుల్లో ఒకరికి మాతృవియోగం సంభవించింది. మరొక సభ్యునికి కాలు విరిగింది.

5.ఐదు గదులను తెరిచిన తరువాత ఆరోగదిని కూడా తెరవాలనుకున్నారు. అయితే, ఆ గది తలుపులపై నాగపాముల చిహ్నాలు కనిపించడంతో వెంటనే సాహసించలేకపోయారు.

6.ఈలోగా సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో మరో కమిటీ వేసి ఆస్తుల గుర్తింపు, భద్రపరిచే చర్యల పర్యవేక్షణ చేపట్టాల్సిందిగా సూచించింది. ఈ కమిటీ సూచన మేరకు ఆరోగది విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు.

7.మొదటి గది తెరిచినప్పటి నుంచే నాగబంధం తన ప్రభావాన్ని చూపుతున్నదని స్థానికులు చెబ్తున్నారు.

8.ఇందుకు పరాకాష్టగా నిధులపై కోర్టులో కేసు వేసిన ఆజన్మ బ్రహ్మచారి అయిన సుందరరాజన్ కూడా కన్నుమూశారు.

9. ఆయన మరణం వెనుక కూడా నాగబంధం ప్రభావం ఉన్నదన్నది స్థానికుల్లో కొందరి ప్రగాఢ నమ్మకం.

10.ఆపార నిధినిక్షేపాలు ఐదు గదుల్లో ఉండగా, కేవలం ఆరో గదికే నాగబంధం వేశారని అనుకోవడం ఒట్టి భ్రమ అని తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తి ఒకరు చెప్పారు.

11.నాగబంధం ఒకసారి వేస్తే, అది వేల సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, సర్పజాతి ఉన్నంత వరకు ఈ బంధం పటిష్టంగానే ఉంటుంది.
12.ఐదు తలల పాము దగ్గర నుంచి అనేక విషపూరిత పాములను నాగబంధం వేసేటప్పుడు ఆవాహన చేస్తారు. ఆ క్షణం నుంచే అవి నిధినిక్షేపాలను కాపాడుతుంటాయి.

13.అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఇలాంటి నాగబంధమే ఉన్నది. ఇది మొత్తం నిధినిక్షేపాలకు సంబంధించిన బంధమే కానీ, కేవలం ఆరోగదికి మాత్రమే పరిమితమైనది కాదు.
14.అందుకే, నిధినిక్షేపాలున్న గదులు తెరవగానే కీడు జరగడం మొదలైంది. అకాల మరణాలు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

15.మరి ఆరోగది తలుపులు తెరిస్తే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందని కేరళలోని తాంత్రికుడ్ని ఫోన్ ద్వారా సంప్రదిస్తే దొరికిన సమాధానమిది.

16.ఆరోగది తలుపులు ఇప్పుడు తెరిచినా, తెరవకపోయినా జరగాల్సిన కీడు జరగడం మొదలైంది. కాకపోతే నాగబంధం ప్రభావం ఈ గదిలో మరింత ఎక్కువగా ఉండవచ్చు.
17.ఆరోగది తలుపులు తెరిస్తే, అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకోవచ్చు. మరిన్నిదారుణాలు జరగవచ్చు.
18.తాంత్రిక శాస్త్ర పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నాగబంధాన్ని విముక్తి చేయవచ్చా…అని అడిగినప్పుడు వచ్చిన సమాధానం ఇది…
19.ఆ పని ముందే చేయాల్సింది. అంటే, మొదటి గది తలుపులు తెరవడానికి ముందే తాంత్రిక శక్తులున్న వారిని పిలిపించి నాగబంధం నుంచి నిధినిక్షేపాలను విముక్తి చేసిన తరువాత గది తలుపులు తెరిస్తే బాగుండేది.

ఈ దేవాలయ నేల మాళిగలలో నికి లక్ష కోట్ల రూపాయల సంపద ఎలా వచ్చింది?

పద్నాలుగు, పదిహేను శతాబ్ధాలకాలంలో యూరోపియన్ దేశాలు, మన దేశంతొ సుగందద్రవ్యాల వ్యాపారం చేసేటప్పుడు, మలాబార్ తీరంలో ఉన్న ఈ ప్రాంతానికి అనంతంగా సంపద వచ్చిచేరిందని చెబుతారు. దానితో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విజయనగరరాజులు, చేరరాజులు, పురప్రముఖులు, సాధారణ ప్రజలు.ఇబ్బిడి ముబ్బిడిగా పద్మనాభుడికి కానుకలు సమర్పించి ఉండవచ్చు. తరువాతి కాలంలో డచ్చివారినుంచి, బ్రిటిష్ వారినుంచి, పొరుగు రాజయిన టిప్పు సుల్తాన్ నుంచి ఈ రాజ్యానికి ముప్పుపొంచి ఉండడంతో 18 శతాబ్ధంలో ఈ గుడిని పునర్నిర్మించినప్పుడు సంపదనంతా నేలమాళిగలలో బద్రపరిచారు. అదే ఇప్పుడు బయటపడిన బంగారు గని.

No comments:

Post a Comment

మీ అభిప్రాయం తెలియచేయండి.