మెదక్
ఏడుపాయల జాతర :
ఈ జాతర మెదక్ జిల్లా పాపన్నపేట మండలం
నాగసానిపల్లిలో జరుగుతుంది.
-ఈ ప్రాంతం వద్ద మంజీర నది ఏడు పాయలుగా చీలిపోతుంది.
ఇక్కడే దుర్గాభవాని ఆలయం ఉంది.
-ఈ ఏడుపాయల్లో మూడుపాయలు దుర్గాభవాని ఆలయం
ముందు వైపు నుంచి, మిగిలిన నాలుగు పాయలు దుర్గాభవాని
ఆలయం వెనుక వైపు నుంచి ప్రవహిస్తాయి.
-ఈ జాతర ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున జరుగుతుంది.
దుర్గాభవాని దేవాలయం
-ఈ ఆలయాన్ని గరుఢ గంగ అని కూడా అంటారు.
-ఆ జాతరను మూడు రోజులపాటు నిర్వహిస్తారు.
-ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రధానంగా ఏడుపాయల స్నానం
ఆచరిస్తారు.
-ఈ జాతరలో పాల్గొన్న భక్తులు ఒక రాత్రి గుడిలో
నిద్రపోవడం ఆచారంగా కొనసాగుతున్నది.
జోగినాథుని జాతర
-మెదక్ జిల్లా జోగిపేటలోని కొండపై జోడు లింగాలుగా వెలసిన
జోగినాథుని జాతర ప్రతి ఏటామార్చిలో జరుగుతుంది.
కేతకి సంగమేశ్వర స్వామి జాతర
-మెదక్ జిల్లాలో జహీరాబాద్ సమీపాన ఝరాసంగం గ్రామంలో
కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది.
-ప్రతి ఏడాది మాఘ బహుళ దశమి నుంచి ఫాల్గుణ శుద్ధ
పాడ్యమి వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు
జరుగుతాయి.
నల్లగొండ
-గొల్లగట్టు జాతర/దురాజ్పల్లి జాతర
-తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర.
-ఈ జాతర జరిగే ప్రదేశం - నల్లగొండ జిల్లా సూర్యాపేట
దగ్గరలోని పాలశేర్లయ్యగట్టు ప్రాంతం
-ఈ జాతరను పెద్దగట్టు జాతర అని కూడా అంటారు.
-యాదవులు తమకు ఆరాధ్య దైవమైన లింగమంతుల
స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి రెండేండ్లకోసారి
నిర్వహిస్తారు. లింగమంతుల స్వామి సోదరి - చౌడమ్మ.
-నాలుగు రోజుల పాటు ఈ జాతరను నిర్వహిస్తారు.
-మొదటిరోజు : 30 విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను కేసారం
గ్రామానికి తీసుకెళ్లి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు.
తదనంతరం కంకణాలు కట్టి ఊరేగింపుగా గుట్టపైకి
తీసుకువస్తారు. తర్వాత చౌడమ్మకు మొక్కులు చెల్లిస్తారు.
ఖాసీంపేట యాదవులు పసిడికుండను ఆలయ గోపురం మీద
అలంకరిస్తారు.
-రెండో రోజు : బోనాలు వండుకొని లింగమంతుల స్వామికి, పక్కన
ఉన్న చౌడమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పిస్తారు.
-మూడో రోజు : నెలవారం చేసి పోతరాజు, మిగిలిన దేవుళ్లకు
మొక్కులు చెల్లిస్తారు.
-నాల్గవ/చివరి రోజు : సూర్యాపేట యాదవులు
మకరతోరణాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు. తదనంతరం
పూజారులు దేవుళ్లకు కేసారం చేయడంతో జాతర పూర్తవుతుంది.
-ఈ జాతరలో దిష్టిపోయడం అనేది ప్రధాన ఆచారంగా
వస్తుంది. దీన్ని వరంగల్ జిల్లా చికటాయపాలెంలోని
దేవరవంశీయులు, నల్లగొండ జిల్లాకు చెందిన తుండు, మట్ట
వంశ పూజారులు నిర్వహిస్తారు.
చెర్వుగట్టు జాతర
-నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని
ఎల్లారెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఉత్సవాలు జరుగుతాయి.
-ఇక్కడి ప్రధాన దైవం - శ్రీజడల రామలింగేశ్వరస్వామి.
మేళ్లచెర్వు జాతర
-నల్లగొండ జిల్లా హుజూర్నగర్ తాలూకాలోని మేళ్లచెర్వు
గ్రామ సమీపంలో ఈ జాతర జరుపబడుతుంది.
-ఈ జాతరలో శంభులింగేశ్వరస్వామి ప్రధాన దైవం.
-శంభులింగేశ్వర స్వామి లింగం పైభాగాన ఐదు సెం.మీ.ల వివరం
ఉంటుంది. దీంట్లో ఎప్పుడూ జలం ఉంటుంది.
-ఈ లింగం లోపల ఉన్న జలాన్ని భక్తులకు తీర్థంగా
ఇస్తుంటారు.
అడవిదేవులపల్లి జాతర
-నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని అడవి
దేవులపల్లిలో ఈ జాతర జరుగుతుంది.
-ప్రధాన దైవం - కనకదుర్గమ్మ తల్లి.
-ఈ జాతరలో ప్రత్యేక కార్యక్రమాలు : సిడిమాన్
ఊరేగింపు, బండ్ల ఊరేగింపు, గండదీపం
కోదండాపురం జాతర
-నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లిపల్లి మండలంలోని
కోదండాపురం గ్రామంలో జాతర జరుగుతుంది.
-ఇక్కడి ప్రధాన దైవం - శ్రీవెంకటేశ్వరస్వామి
-ప్రతి ఏడాది మాఘ బహుళ పంచమి నుంచి ఏకాదశి వరకు
అంగరంగవైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
-ఏడు రోజుల్లో రథోత్సవం ముఖ్యమైంది.
చౌడమ్మ జాతర
-నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకాలో అనేక గ్రామాల్లో
ఈ జాతర జరుగుతుంది.
-చౌడమ్మ యాదవుల కుల దేవత. చౌడమ్మ జాతరను
మూడు రోజుల పాటు జరుపుతారు.
తుల్జాభవాని జాతర
-నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పెద్దమునిగల్లో
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదిరోజుల పాటు
ఈ జాతర నిర్వహిస్తారు.
-ఈ జాతరలో అనేకమంది లంబాడీ తెగకు చెందినవారు
పాల్గొంటారు.
-జాతర జరిగే తొమ్మిది రోజులు పూజారి ఉపవాసం ఉండి
విజయదశమి రోజున ఉపవాసం విరమిస్తారు.
జ్యోతిష్యం "శాస్త్రం". సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అందువల్లనే మనవ మరియు ప్రకృతిలో విపరీత ధుర్ఘటనలు చూస్తున్నాము. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూడనమ్మకము అన్నవాడు చెప్పలేడు. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు.
26 February 2016
ఏడుపాయల జాతర
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియచేయండి.