శ్రీ వరసిద్ధి వినాయక స్వామి - కాణిపాకం
*************************************
కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని,
పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం.
చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు.
వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు.
ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ,మరొకరికి చెవుడు.
వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు.
పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు.
ముగ్గురిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు.
అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది.
దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు.
కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో...........
కొద్దిసేపు ఆపి క్రిందకు జాగ్రత్తగా చూశాడు.
గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి
ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేష్టుడయ్యాడు.
కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.
మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తగా పోయి,
వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు.
ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్తులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు.
వారి ప్రయత్నం ఫలించకుండానే
వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది.
ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు.
ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది.
దీన్ని కాణిపారకం అనే తమిళ పదంతో పిలిచేవారు,
రానురాను కాణిపాకంగా పిలవసాగారు.
ఈ రోజుకి కూడా ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది.
అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడ వున్నది.
దానిలో స్వామి వారి వాహనము ఎలుక వున్నది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియచేయండి.